మచిలీపట్నం :
మచిలీపట్నం పరాసుపేట లో వేంచేసియున్న సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి దేవస్థానంలో రెండవ మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి తిక్కిశెట్టి మోహన్రావు పర్యవేక్షణలో ఆలయ భక్త బృందంచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో వందలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
Comments
Post a Comment