మచిలీపట్నంలో మరో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూలు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
మచిలీపట్నంలో మరో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూలు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గన్నవరం విమానాశ్రయంలోనీ సమావేశ మందిరంలో
క్రీడల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కొత్తగా మచిలీపట్నం నగరంలోని గో సంఘం టిడ్ కో గృహాల సమీపంలో నూతనంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం, 9:30 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. , వాటిని నిర్మించేందుకు అవసరమైన తాజా ప్రతిపాదనలతో కూడిన ప్రాజెక్టు నివేదిక రూపొందించి వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర శాప్ ఏడి వేణు ,
క్రీడల అధికారి సురేంద్రబాబు, కన్సల్టెంట్ మోహన్, ఆర్ అండ్ బి డి ఈఈ సంగీత, ఏపీఎంఐడిసి డి ఈ ప్రవీణ్, టెక్నికల్ అసిస్టెంట్ చల్లా రాము తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment