Skip to main content

జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పోలీసుల విస్తృత అవగాహన సదస్సులు



జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేర రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ & శక్తి టీమ్స్ కార్యాచరణ

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల భద్రతే ధ్యేయంగా పోలీస్ అధికారులు మరియు శక్తి టీమ్స్ సంయుక్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బందర్ డిఎస్పి సిహెచ్ రాజా గారు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు
 బాలికల రక్షణ & పోక్సో (POCSO) చట్టం:

బాలికలు తమపై జరిగే ఎలాంటి వేధింపులనైనా మౌనంగా భరించకూడదని, అపరిచిత వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేధింపులకు గురైతే పోక్సో చట్టం కింద నిందితులకు పడే కఠిన శిక్షల గురించి వివరిస్తూ, బాధితులకు చట్టం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 సోషల్ మీడియా వినియోగం - జాగ్రత్తలు

 ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అపరిచితులతో స్నేహం చేయడం, వ్యక్తిగత ఫోటోలు, సమాచారం పంచుకోవడం వంటివి ప్రమాదకరమని వివరించారు. సామాజిక మాధ్యమాలను కేవలం విజ్ఞానం కోసం మాత్రమే వాడాలని, సైబర్ వేధింపులకు గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

 రోడ్డు భద్రత:

రహదారి నిబంధనలు పాటించడం పౌరుల బాధ్యత అని, ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

బాల్య వివాహాల నిర్మూలన

 చదువుకోవాల్సిన వయసులో బాలికలకు పెళ్లిళ్లు చేయడం నేరమని, అటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

మత్తు పదార్థాల నియంత్రణ (Anti-Drugs)

యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కూడిన లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు  

ఏదైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితిలో 112 నంబర్‌ను సంప్రదించాలి.
మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే 1972 నంబర్‌కు తెలియజేయాలి.

    సైబర్ నేరాలకు గురైతే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...