Skip to main content

శిష్టకరణాల సామాజిక వర్గాన్ని ఆదుకోవాలి


సామాజిక భవనాలకు నిధులు మంజూరు చేయాలి

కార్పొరేషన్ చైర్మన్ లను డైరెక్టర్లను నియమించడంలో సిఫారసు చేయాలి

మచిలీపట్నం :

ఉద్యోగ, ఉపాధి ఆర్థిక రంగాల్లో వెనుకబడిన శిష్టకరణాలను ఆదుకోవాలని టిడిపి శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, ఏపీ శిష్టకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కుమహంతి రాజా కేంద్ర విమానాయనశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల రెండు రోజుల పర్యటనకు ఆదివారం విచ్చేసిన ఆయన కిడ్నీ తదితర సమస్యలల్లో ఉన్న కొన్ని శిష్టకరణ కుటుంబాలను పలకరించారు. అనంతరం శ్రీకాకుళం లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ను కలిసి శిష్టకరణాల దయనీయ స్థితిగతులను వివరించారు. ముఖ్యంగా కేంద్ర బీసీ జాబితాలో శిష్ట కరణ సామాజిక వర్గాన్ని చేర్పించడం లో ప్రయత్నాన్ని ముమ్మరం చెయ్యాలని, సామాజిక భవన నిర్మాణాలకు, స్థలాలు- నిధులు కేటాయించడంలో, ఆర్థిక చేయుత నిమిత్తం సంక్షేమ పథకాలు సంపూర్ణంగా చేరడం కోసం శిష్టకరణ కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్ లను నియమించడం లో కృషి చెయ్యాలని కోరారు. సోమవారం దివంగత ప్రజానేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అరసవల్లి లో గల మాజీ టీడీపీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిఇంటికి చేరుకుని ఆమె భర్త మృతి కారణంగా ఆమెకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ తో కూడా ముచ్చటిస్తూ టిడిపి ప్రభుత్వ ప్రగతిని, ఒకనాటి నాయకుల కృషిని గుర్తుచేసుకున్నారు. శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర నాయకులు మానాపురం గౌరీశ్వర రావు సదాశివుని వెంకటేశ్వర రావు, మునగవలస రవీంద్రబాబు, కుప్పిలి వెంకట రమణమూర్తి, కరకవలస ప్రహ్లాదరావు, ఎస్విడి మురళి, ఆర్వీన్ శర్మ, పెదపెంకి శ్రీరామ్ కుమార్, బలివాడ గోవిందరావు, డబ్బీరు వెంకట రావు , బెహరా నాగేశ్వర రావు తదితరులు వీరితోపాటు ఉన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...