Skip to main content

ఘనంగా పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి



మచిలీపట్నం :

భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం
ఘనంగా - మాజి సమర్పణ దివస్, కార్యక్రమం ను బిజెపి కార్యాలయంలో, జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథి గా రాష్ట్ర నేషనల్ ప్యానెల్ అధికార ప్రతినిధి యామిని శర్మ పాల్గొని ప్రసంగించారు.
 ఈ సందర్భంగా యామిని శర్మ మాట్లాడుతూ, భారతీయ జనసంఘ్ మాజి అధ్యక్షులు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి ని, సమర్పణ దివస్ గా జరుపుకుంటున్నాం అని దీనదయాళ్ చిన్నతనం లోనే తల్లి, తండ్రులు లను కోల్పో యారని మేనమామ వద్ద పెరిగిన ఆయన చదువు కొనే సమయంలో మొదటి శ్రేణిలో పాస్ అయ్యే వారిని, ఆ సమయం లోనే దీనదయాళ్ ఉపాధ్యాయ కి ఆర్ఎస్ఎస్ పరిచయం ఏర్పడి , దేశ, సమాజ సేవలో పని చేయడానికి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నారు.డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ గురూజీ ని కలిసి కొంతమందిని ఇవ్వాలని కోరగా, దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి,తదితర ప్రముఖులను జనసంఘ్ పార్టీ కి పంపించారు. 1953 నుండి 1968 వరకు జనసంఘ్ లో అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ ని దేశం వ్యాప్తం చేసారు.
విజయవాడ లో జరిగిన జాతీయ పార్టీ సమావేశాలలో - ఏకాత్మ మానవతా వాదాన్ని - ఏకగ్రీవంగా పార్టీ సిద్ధాంతంగా అంగీకరించారు.‌ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు చేయాలన్నదే అంత్యోదయ కార్యక్రమం ఆవాజ్ పాయ్, ఈనాటి మోడీ ప్రభుత్వం, విఖసిత్ భారత్ కార్యక్రమం ఘనంగా అమలు చేశారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ దేశ సేవ, త్యాగనిరతి, సిద్దాంతాన్ని అందించిన ఆయన ఆదర్శాలు మనకు ఆచరణీయం అని, దీనదయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బిజెపి -సమర్పణ దివస్ - జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో పంతం గజేంద్ర, పుప్పాల రాము, ఎస్.సుబ్బారావు నాయుడు,కూనపరెడ్డి శ్రీనివాస్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, సూరి శెట్టి హరికృష్ణ,వైవిఆర్ పాండురంగారావు, వి. రమణ, గాజుల సిద్ధార్థ, ఎన్.గాయత్రి, మండల అధ్యక్షులు సాయి, కెవి రామారావు, వి. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...