Skip to main content

మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు



మచిలీపట్నం :

      మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి మరణించెంత వరకు జైలు శిక్ష (జీవిత కాలపు) 6,000/- రూపాయల జరిమానా విధించిన విజయవాడ, పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ. పూర్తి వివరాలు కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని మంటాడ గ్రామంలో ఫిర్యాది తన తల్లితో కలసి నివాసం ఉంటున్నట్లు, ఆమె తల్లి దండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం అయినట్లు, తల్లి దండ్రులు మనస్పర్థల కారణంగా విడిపోయి ఇద్దరు ఆడపిల్లలు తల్లితోకలసి మంటాడ గ్రామం లో నివాసం ఉంటున్నట్లు, ఫిర్యాది తండ్రి / అన్న కొమ్ము సౌల్ ఇద్దరు ప్రకాశం జిల్లాలోని, కొండెపి మండలం, పెట్లూరు గ్రామంలో ఉంటున్నట్లు, 2023 సంవత్సరంలో ఫిర్యాది అన్న సౌల్ తన తల్లి వద్దకు మంటాడ గ్రామం వచ్చి వెళ్ళినట్లు అప్పటినుండి తన తల్లి మరియు చెల్లి తో మాట్లాడుతున్న క్రమంలో ఫిర్యాదితో నువ్వు నాకు ముద్దు పెట్టుకున్న ఫోటోస్ ఉన్నాయని ఫిర్యాదిని బెదిరించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లుగా అలాగే ది. 2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇంటికి తీసుకువెల్లకుండా విజయవాడలోని, గుణదల మేరీ మాత చర్చి కి తీసుకువెళ్ళి తాళికట్టి అనంతరం విజయవాడ బస్ స్టాండ్ వద్ద గల లాడ్జి కి తీసుకువెళ్ళి శారీరకంగా కలిసినట్లు, తర్వాత అక్కడనుండి పెట్లూరు గ్రామం తీసుకెళ్ళి అక్కడ రెండు రోజుల తర్వాత ఫిర్యాది తండ్రి మరియు అన్న ఇద్దరు కలసి ఫిర్యాదిని పని నిమిత్తం అని చెప్పి హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్న క్రమంలో ఫిర్యాది అన్న తండ్రి లేని సమయంలో బలవంతంగా అనేక సార్లు శారీరకంగా కలిసినాడు. కొంతకాలం తర్వాత ఫిర్యాది తల్లి పెట్లూరు గ్రామం వచ్చి కొడుకు సౌల్ కి ఫోన్ చేసి ఫిర్యాదిని పెట్లూరు గ్రామం పంపించమని చెప్పగా 2025 తేదీన ఫిర్యాది అన్న మరియు తండ్రి ఇద్దరు ఫిర్యాదిని హైదరాబాద్ నుండి తీసుకుని వచ్చి ఒంగోల్ బస్ స్టాండ్ లో దింపి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతటా ఫిర్యాదిని ఆమె చెల్లి , పెదనాన్న కొడుకు ఇద్దరు ఒంగోల్ బస్ స్టాండ్ కి వచ్చి ఫిర్యాదిని పెట్లూరు గ్రామంలోని ఇంటికి తీసుకువెళ్ళినారు. కొన్ని రోజుల తర్వాత ఫిర్యాదికి జ్వరం, వాంతులు అవుతుండగా ఫిర్యాది తల్లికి అనుమానం వచ్చి ప్రెగ్నెంకి కిట్ తో పరీక్షించగా ప్రెగ్నెంట్ అని తెలిసినది. అంతటా ఫిర్యాదిని ఏమి జరిగినది అని అడుగగా తన అన్న అయిన కొమ్ము సౌల్ ఫిర్యాదిని బెదిరించి వివాహం చేసుకుని పలుమార్లు బలవంతంగా శారీరకంగా కలిసినడని చెప్పినది. అంతట ఫిర్యాది తల్లి ఫిర్యాదిని వెంట పెట్టుకుని కొండెపి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగా వారు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు.. కృష్ణా జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు నిందితుడు పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఫోక్స్ కోర్టు నందు ప్రవేశపెట్టారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు విధించింది ఫోక్సో కోర్టు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా మహిళల పట్ల చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన, వారిపై అఘాయిత్యాలకు తెగబడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడేది లేదని, కృష్ణా జిల్లా పోలీసులు మహిళలపై జరిగే నేరాల పట్ల కఠినంగా గా వ్యవహరిస్తారు అనడానికి ఈ కోర్టు తీర్పు ఒక ఉదాహరణ అని తెలియజేశారు. సమాజంలో మహిళలు గాని చిన్నారులు గాని ఎవరైనా ఇటువంటి నేరాలలో చిక్కుకుంటే ధైర్యంగా వచ్చి పోలీసు వారి సహాయాన్ని పొందవచ్చని ఫిర్యాదు చేయడానికి వెనుకాడ వద్దని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో డిఎస్పి కి సహకరించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డ్ అందించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...