Skip to main content

ఘనంగా మహాశివరాత్రి పర్వదినం - భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న నాగులేరు వాగు

మచిలీపట్నం :

      మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మచిలీపట్నం నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి పండుగ సందర్భంగా నాగులేరు వాగు వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు అభిషేకాలతో శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
       మచిలీపట్నం కాలే ఖాన్ పేటలోని మంచినీటి కాలువ గా పిలువబడుతున్న నాగులేరు వాగు కు భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. భక్తుల తో నాగులేరు వాగు రద్దీగా మారింది. పండుగ సందర్భంగా ఉదయం నుండి నాగులేరు వాగులో భక్తులు పుణ్యా స్నానంను ఆచరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. శివాలయము భక్తులతో కిక్కిరిసింది.

        భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. వృద్ధులకు మహిళలకు హిందూ స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేశారు. మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ నాగులేరు వాగు పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచారు. 
  
         అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లను నియమించి భక్తులకు మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. పూజారులు, జంగమ దేవర్లు, భక్తుల పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు దారి పొడవునా పలువురు దాతలు మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. 
         భక్తులు పితృదేవతలకు తర్పణాలు అనంతరం దానధర్మాలు చేశారు. మహాశివరాత్రి రోజున దానమిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మచిలీపట్నం బస్టాండ్ వద్ద నుండి దక్షిణ కాశీగా పేరుపొందిన పెద్ద కళ్లెపల్లికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులతో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించారు. మచిలీపట్నం నుండి భక్తులు పెదకళ్లెపల్లికి శివుని దర్శించుకుని పూజలు చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...