మచిలీపట్నం:
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుండి వస్తు సేవల పన్నులు సజావుగా వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వాణిజ్య పన్నుల వసూలు పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఆస్తులు, భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు. తప్పనిసరిగా వస్తు సేవల పన్నులు వసూలు అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సంబంధిత వ్యక్తులకు సంబంధించి బ్యాంకు వివరాలను కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.
పట్టణాలలో గాని గ్రామ పంచాయితీలలో గాని ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ లు తప్పనిసరిగా వస్తు సేవల పన్ను చెల్లించాల్సి ఉంటుందని అటువంటి వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.
అలాగే పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, గనులు భూగర్భ శాఖల అధికారులు టాస్క్ ఫోర్స్ ఏర్పాటై ఉమ్మడిగా వాహనాలను తనిఖీ చేసి వస్తు సేవల పన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా వృత్తి పన్ను వసూలు చేస్తున్నారా లేదా విచారించి అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ జి కల్పన, అదనపు ఎస్పీ వి నాయుడు, వాణిజ్య పనుల శాఖ సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజకుమార్, డిపిఓ డాక్టర్ జె అరుణ, డిఎస్ఓ మోహన్ బాబు జెడ్పి డిప్యూటీ సీఎం సిఈఓ ఆనంద్ కుమార్ జిల్లా ఆడిట్ అధికారి సూర్య ప్రకాష్ రావు జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ గనులు భూగర్భ శాఖ ఏజీ కొండారెడ్డి మచిలీపట్నం తాడిగడప ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, నజీర్, రామారావు వాణిజ్య పన్నుల శాఖ డి ఏ సి చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment