Skip to main content

నకిలీ నోట్లపై కఠినంగా వ్యవహరిస్తాం.... జిల్లా ఎస్పీ

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్.

మచిలీపట్నం :

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దొంగ నోట్ల మార్పిడి ముఠా ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ మాట్లాడుతూ కృత్తివెన్ను మండలం సంఘముడి గ్రామంలో వైన్ షాప్ నందు ఫిబ్రవరి 2వ తేదీ ఇద్దరు వ్యక్తులు రెండు 500 రూపాయలు నకిలీ నోట్లు తీసుకువచ్చి మద్యం కొనుగోలు చేశారు అని, అనంతరం వైన్ షాప్ యజమాని నోట్లు పరిశీలించగా నకిలీ నోట్లను గుర్తించి వాటిపై కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.. నకిలీ నోట్ల ముఠా పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఉపయోగించి ముద్దాయిలను పట్టుకున్నామని ఎస్పీ వివరించారు.

ముద్దాయిల వివరాలను పెందుర్తి మండలం కోకావానిపాలెం గ్రామం కు చెందిన తోమండ్ర రంజిత్ సింగ్ బ్రహ్మ ఉమా శంకర్ , దిలీప్ ,పాశం రాజశేఖర్ అని తెలిపారు. ముద్దాయిలు గతంలో గంజాయి కేసు ,నాలుగు నకిలీ నోట్ల కేసులో నమోదయ్యాయి అని అన్నారు. ముద్దాయిలు కోకామని పాలెం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని నకిలీ నోట్ల ప్రింటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ముద్దాయి వద్ద నుండి 6,2,400 విలువ చేసే నకిలీ నోట్లను, 6000 రూపాయలు ఒరిజినల్ క్యాష్ ను, నకిలీ నోట్ల తయారు చేసే యంత్రాలను, మూడు సెల్ ఫోన్లు, హుండాయ్ శాంట్రో కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేసామన్నారు.

కృష్ణాజిల్లాలో ఎవరైనా అక్రమంగా నకిలీ నోట్లో ముద్ర వేసిన నకిలీ నోట్లో మార్చిన నకిలీ నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...