Skip to main content

ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: ఎస్.టి.యు. ధర్నా



మచిలీపట్నం :
            
      కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ప్రధానమైన డిమాండ్ తో ఎస్.టి.యు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మచిలీపట్నం ధర్నా చౌక్ లో కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

         రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో ఉద్యోగులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్కటి పూర్తి గా అమలు చేయలేదని, ప్రధానంగా 12వ పి.ఆర్.సి. నియామకం, 30% మధ్యంతర భృతి మంజూరు, సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేయాలని, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

        జిల్లా అధ్యక్షులు పి. ఇమ్మానుయేల్ ప్రసంగిస్తూ ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు ఎస్.టి.యు. దశల వారీ ఉద్యమం లో భాగంగా ధర్నా జరుగుతుందని, ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల 25 న "చలో విజయవాడ" చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు వి కృష్ణమూర్తి మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి చెల్లింపులు సం.ల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయని, రాష్ట్ర ముఖ్య మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. 
 
        రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ డి.ఎస్.సి. 2003 టీచర్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కొమ్ము ప్రసాద్, ముతహర్ అలీ, కృష్ణ మోహన్, సతీష్, శ్రీనివాస్ మూర్తి, జిల్లా అధ్యక్షులు పి. ఇమ్మానియేల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. వి. కృష్ణ మూర్తి,రాష్ట్ర అదనపు కార్యదర్శి డి చంద్రశేఖర్ ,రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి కె. మాధవ రావు ,రాష్ట్ర కౌన్సిలర్ కొమ్ము ప్రసాద్ ,ఎం వి ఎస్ ఎన్ ప్రసాద్ కే సతీష్ బాబు అర్బన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. కిరణ్ బాబు యం. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...