Skip to main content

ఏపి పోలీసుల తీరుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం

మచిలీపట్నం:

నిందితులను రోడ్లపై పోలీసులు నడిపించటం పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్ పై విచారణ

          కేసు నమోదైన నిందితులను తమ ఇష్టానుసారంగా రోడ్లపై నడిపిస్తూ అవహేళనకు గురి చేస్తున్నారంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్, విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
 
        ఈ వ్యాజ్యంపై ఫిబ్రవరి 4, 2026న జరిగిన విచారణలో  ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ కొవ్వూరులో నిందితుడిని తీసుకువెళ్ళే వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డుపై వెళ్తుండగా ఫొటోలు తీశారని కోర్టుకి తెలిపారు.

        పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తన వాదన వినిపిస్తూ ఇలాంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, ఇది చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. పోలీసులు నిందితులను నడి రోడ్డుపై నడిపించడం తో పాటు బహిరంగంగా తెనాలిలో యువకులను కొట్టిన అంశాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

        పోలీసులు చట్టాన్ని చేతులలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉంది. పోలీసుల తీరును నిలువరించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని వాదనలు వినిపించిన శ్రవణ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిందితుల పట్ల ప్రవర్తించిన తీరును వీడియోలు, ఫోటోల రూపంలో న్యాయమూర్తి కి అందజేసిన న్యాయవాది శ్రవణ్ కుమార్
        ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం జడ శ్రవణ్ వాదనలతో ఏకీభవించింది. పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు బాగుండాలి. కొన్ని వీడియో లలో పోలీసులు ఇష్టారీతిన తిడుతున్నట్టు ఉంటుంది. పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

       ఈ విషయమై రాష్ట్ర డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల ఎస్పీలు నాలుగు వారాలలోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...