Skip to main content

అభివృద్ధి, సంక్షేమానికి విజన్ డాక్యుమెంట్‌లా 2026-27 బడ్జెట్



ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది

బడుగు బలహీన వర్గాల సంక్షేమం, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట

సంక్షేమానికి ఏకంగా రూ.91,527 కోట్ల కేటాయింపు పేదల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం

మచిలీపట్నం :

         ఏపీ నెంబర్ వన్ లక్ష్యంగా సాగుతున్న పాలనకు 2026-27 బడ్జెట్ విజన్ డాక్యుమెంట్‌లా ఉంది. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించేలా బడ్జెట్ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశ దిశ చూపించేలా బడ్జెట్ రూపొందించడం హర్షణీయం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశాం. 

        చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలంబనగా ఉంది. బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.51 వేల కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.6090 కోట్లు, మహిళా సంక్షేమానికి రూ.4582 కోట్లు చొప్పున సంక్షేమం కోసం ఏకంగా రూ.91,527 కోట్లు కేటాయించడం పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. పాఠశాల విద్య కు రూ.32,308 కోట్ల కేటాయింపు విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

         గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు కేటాయించాం. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా వైద్యారోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించాం. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...