Skip to main content

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం: 

       స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

       శనివారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యాలయ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పది సూత్రాలు రూపొందించిందని, అందులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఒకటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ విధంగా ప్రతి నెలలో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంచుకుని, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి శుభ్రం చేస్తూ ముందుకెళ్తున్నామని, నేడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశామన్నారు. 

         అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆ నెలకు నిర్దేశించిన ఇతివృత్తం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతూ, ఈ నెలకు జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే ఇతివృత్తం అని తెలిపారు.

        గత నెలలో స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) అనే ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించామన్నారు. నగరంలో కాలుష్య రహిత వాయువు లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఆధారిత వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగంతో వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. కలెక్టరేట్లో విధులకు హాజరయ్యే జిల్లా కేంద్రం పరిధిలోని ఉద్యోగి సైకిల్ లేదా కాలినడకన విధులకు హాజరు కావాలని సూచించామని, చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా అలా రావడం అభినందనీయమన్నారు. సైకిల్ తొక్కడం వల్ల మంచి ఆరోగ్యం పెంపొందడమే కాకుండా శబ్ద, వాయు కాలుష్యం తగ్గి ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించేందుకు జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరలో ఈ–సైకిల్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

       కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, మచిలీపట్నం మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్ గోపాలకృష్ణ మూర్తి, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, కలెక్టరేట్ ఏవో రాధిక, డీఈవో యు వి సుబ్బారావు, మార్కెటింగ్ ఎడి నిత్యానంద్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/rCOqgDMjwIo?si=gX8OhVViAWQchdde

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...