Skip to main content

పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించవచ్చా???? చట్టం ఏం చెబుతుంది....

 
మచిలీపట్నం:
 
      ఆదివారం రాబర్ట్ సన్ పేట్ పోలీసులు ఒక కేసులో నిందుతులను బహిరంగంగా నడిపించి స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. ఈ సంఘటనపై సీఐ ఏసుబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు మచిలీపట్నం లో మద్యం సేవించిన వారి ఆగడాలు సాగకూడదని, అలాంటి వారికి హెచ్చరికగా నిందుతులను రోడ్డుపై ఉరేగిస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎవరైనా పునరావృతం చేస్తే వారిని కూడా ఇలాగే ఉరేగిస్తామని హెచ్చరించారు. 

      సాధారణంగా ఏదేని కేసులో నిందుతులను మీడియా ముందు ప్రవేశ పెట్టేడప్పుడు, పోలీసులు నిందుతుల ముఖానికి ముసుగు వేస్తారు. కానీ కృష్ణా జిల్లా పోలీసులు మాత్రం రోడ్డుపై ఊరేగించి మీడియాకి, ప్రజలకు ప్రదర్శన చేశారు.
 
         కానీ, పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించడంపై మన దేశంలో చట్టపరమైన నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.

          భారత రాజ్యాంగం ప్రకారం, ప్రతి వ్యక్తికీ (నిందితుడితో సహా) గౌరవంగా జీవించే హక్కు ఆర్టికల్ 21 కల్పిస్తుంది. నిందితుడిని బహిరంగంగా రోడ్డుపై నడిపించడం వల్ల వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని న్యాయస్థానాలు గతంలో పేర్కొన్నాయి.

           సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల తీర్పులు నిందితుడి గౌరవం కాపాడమంటున్నాయి. నిందితుడిని నేరస్తుడిగా కోర్టు నిర్ధారించే వరకు అతను నిర్దోషిగానే పరిగణించబడతాడు. కాబట్టి, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు వారిని అవమానపరిచేలా ప్రవర్తించకూడదు.
 
          అత్యవసరం అయితే తప్ప  నిందితుడు పారిపోయే అవకాశం ఉన్నా లేదా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నప్పుడు తప్ప, సాధారణ పరిస్థితుల్లో వారిని రోడ్డుపై నడిపించడం లేదా ప్రదర్శించడం చేయకూడదు.

        పోలీసులు కొన్ని సందర్భాల్లో నిందితులను బహిరంగంగా తీసుకెళ్తుంటారు. అవి నేరం జరిగిన చోటుకి నిందితుడిని తీసుకెళ్లి వివరాలు సేకరించాల్సి వచ్చినప్పుడు,  నిందితుడు దాచిన ఆయుధాలను లేదా వస్తువులను వెలికితీసే క్రమంలో లేదా వాహనం వెళ్లలేని ఇరుకైన ప్రదేశాల్లో నడిపించాల్సి రావచ్చు.

     నిందితులను ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి లేదా సమాజంలో వారిని తక్కువ చేసి చూపడానికి పోలీసులు రోడ్డుపై నడిపించడం తప్పు అని చట్టం చెబుతుంది. దీనిపై బాధితులు లేదా వారి తరపు న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్ (NHRC) కు లేదా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

      లేదా నిందితుడిని కోర్టులో హాజరు పరిచినప్పుడు, పోలీసులు తనను బహిరంగంగా నడిపించి అవమానించారని నేరుగా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మెజిస్ట్రేట్ దీనిపై విచారణకు ఆదేశించవచ్చు.

శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

https://youtu.be/oYvhvNbsWOY?si=S4wuYokip9lBITOe

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...