Skip to main content

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హై టి....ఎట్ హోం



మచిలీపట్నం:

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హై టి....అట్ హోం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. 

ముఖ్యంగా శాంతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కళాకారులు స్వాతంత్ర్య సమరయోధుల వీర గాధలను, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రూపుదిద్దుకున్న వైనం వివరిస్తూ ప్రదర్శించిన బుర్రకథ అధ్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రత, ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ బుర్రకథ ద్వారా తెలియజేశారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సంబంధించి వివరాలను చాలా తక్కువ సమయంలో ఇచ్చినప్పటికీ బుర్రకథ ద్వారా ఎంతో చక్కగా వివరించారని కళాకారులను అభినందిస్తూ ఆ కళాకారులను శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

అలాగే కూచిపూడి నృత్య కళాకారులు ఏలేశ్వరం పూర్ణచంద్రరావు శిష్య బృందం ఎస్ అశ్విత సాయి పూర్ణ ,సిహెచ్ జాహ్నవి భక్తినృత్యాలు కూడా ఎంతగానో అహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కోనేరు సెంటర్ వద్ద జాతీయ జెండాను నిలిపి స్వాతంత్ర సమరయోధులు తోట నరసయ్య నాయుడును వీరగాధ దృశ్యరూపకాన్ని బాలాజీ విద్యాలయం విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు.


సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్య కళాకారులు, మధు డాన్స్ అకాడమీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులను సీనియర్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఎ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య, జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు గుడివాడ మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓ లు పోతురాజు, జి బాలసుబ్రహ్మణ్యం, బిఎస్ హేలా షారోన్ పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డీఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల డిఎం శివరాం ప్రసాద్, మార్కెటింగ్ ఏడి నిత్యానందం పని ధూర్జటి డి టి డబ్ల్యూ పని దూర్జటి 
తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...