Skip to main content

ఘనంగా కుంకుమ అర్చన మహోత్సవం


మచిలీపట్నం:

     కుంకుమ అర్చన అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పూజా విధానం అని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్,
 పి. వి. ఫణి కుమార్ అన్నారు. నాగులేరు కాలువ గట్టు, కాలే ఖాన్ పేటలో వేంచేసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ కానుకోలను ఫణి కిరణ్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ చండీ పూర్వక కోటి కుంకుమార్చన మహా యజ్ఞ మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున శనివారం
ప్రారంభించారు. 

      ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి వి ఫణి కుమార్ మాట్లాడుతూ శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో నిర్వహిస్తున్న శ్రీ చండీ పూర్వక కోటి కుంకుమార్చన మహా యజ్ఞం జనవరి 12వ తేదీ వరకు జరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి అని కోరారు. 

        ఆలయ అర్చకుడు, బ్రహ్మశ్రీ కాను కొలను ఫణి కిరణ్ శర్మ మాట్లాడుతూ...... కుంకుమ అర్చనను ప్రధానంగా దేవీమాతకు (లక్ష్మి, పార్వతి, దుర్గ అమ్మవార్లకు) నిర్వహిస్తారు అన్నారు. ఇందులో దేవతకు కుంకుమను సమర్పిస్తూ 108 లేదా 1008 నామాలతో అర్చన చేస్తారు. కుంకుమ శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుంది అన్నారు. ఈ అర్చన చేయడం వల్ల కుటుంబం సుఖశాంతులు ఆరోగ్యం, సంపద, మంగళం కలుగుతాయని నమ్మకం అన్నారు. ప్రత్యేకంగా మహిళలు ఈ పూజను భక్తి తో నిర్వహిస్తే ఆ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అన్నారు.

         ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చోడవరపు లక్ష్మీప్రసన్న, ఆధ్యాత్మికవేత్త పి. ఆంజనేయ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అనుమకొండ రామకృష్ణారావు, ఆరేవర పు దుర్గారావు, నున్న తాతారావు, కూరేటి మహేష్, అనుమకొండ ప్రసాదరావు, ఆరేవర పు వెంకటేశ్వరరావు, అర్జా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...