Skip to main content

పరిశ్రమలను నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి... జిల్లా కలెక్టరు



మచిలీపట్నం :

జిల్లాలో వేగంగా అనుమతులు మంజూరు చేసి విరివిగా పరిశ్రమలు నెలకొల్పుటకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశము నిర్వహించి సమీక్షించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వాముల సదస్సు లో భాగంగా భారీ పరిశ్రమలు నెలకొల్పుటకు ఒప్పందాలు చేసుకొని ముందుకు వచ్చిన 10 కంపెనీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేగంగా వ్యాపార అనుమతులు (స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్) మంజూరు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని తద్వారా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీ కింద 1491 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 1471 దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇంకను మిగిలిన 20 దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలించి సత్వరమే అనుమతులు మంజూరు చేయుటకు చొరవ చూపాలన్నారు.

పీఎం విశ్వకర్మ పథకం కింద 2051 యొక్క దరఖాస్తులను రుణాలు మంజూరుకు బ్యాంకులకు పంపామని వాటిలో 873 దరఖాస్తులకు సంబంధించి యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన యూనిట్లు కూడా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. 

ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం కింద 213 దరఖాస్తులు బ్యాంకులకు పంపగా అందులో 134 యూనిట్లు నెలకొల్పారన్నారు.

ఎం ఎస్ ఎం ఈ క్లేయిముల కింద 3 దరఖాస్తులకు సంబంధించి 89.50 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ, స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు రాయితీ లు జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తూ ఉత్తరుడు జారీ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకటరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జి, ఎల్డియం రవీంద్రారెడ్డి, డి టి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ తదితర అధికారులు, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...