Skip to main content

కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ సైకిళ్ళు..... జిల్లా కలెక్టర్

మచిలీపట్నం :

        జిల్లాలో వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం నివారణకు పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎంతగానో తోడ్పడతాయని, ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిచే వర్చువల్ గా ప్రారంభించే ఏర్పాట్లను వెంటనే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

        ప్రకృతిలో రాను రాను వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యము అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పర్యావరణం కలుషితమై మానవుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని నివారించడం కోసం ప్రతి శనివారము కలెక్టరేట్లోపలికి సైకిళ్లపైన గాని లేదా కాలినడకన గాని రావాలని జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సూచించడం జరిగిందన్నారు. 

        ఈనెల 31వ తేదీన కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంచనంగా ప్రారంభిస్తున్నారన్నారు. . 
ఇందులో భాగంగా జిల్లాలో కూడా తొలి దశలో 500 ఎలక్ట్రిక్ సైకిల్ ల పంపిణీకి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించే ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలన్నారు. ఇందుకోసం ఈనెల 27వ తేదీ నాటికి ఎలక్ట్రిక్ సైకిల్లు జిల్లాకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

         ఒక్కో ఎలక్ట్రిక్ సైకిల్ విలువ 23,999 రూపాయలు అవుతుందని, 24 నెలల పాటు ఈఎంఐ ద్వారా కూడా చెల్లించవచ్చని, అవసరమైనప్పుడు బ్యాటరీ చార్జి చేసుకోవచ్చని, ఈ సైకిల్ తొక్కడం ఎంతో సులభమని, ఈ సైకిల్ వాడటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామన్నారు. 

       జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ-- సైకిల్ కొనుగోలుకు ముందుకు రావాలన్నారు.
మండలాల వారీగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోలు చేయనున్న వారి జాబితాను సిద్ధం చేసి ఈ---- సైకిళ్ళు సరఫరా చేసే ఈ మోటోరాడ్ కంపెనీకి అందజేయాలన్నారు. 

      రెండు డెమో సైకిళ్లను కూడా జిల్లా కేంద్రంలో వెంటనే అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కంపెనీ నిర్వాహకులకు సూచించారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ సైకిళ్ళు విడిభాగాలను కలుపుట, వాడకంపై కొంతమంది యువతీ యువకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఉత్సాహం ఉన్న యువతను ఎంపిక చేయాలని కలెక్టర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నరేష్కు సూచించారు. 

      ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ చంద్రశేఖర రావు రావు డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్ ఈ మోటోరాడ్, పూణే కంపెనీ వ్యవస్థాపకులు కపిల్ మాండలిక్, దక్షిణ ప్రాంత ప్రతినిధి దర్శన్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...