Skip to main content

యోగాతో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం.... కమిషనర్ బాపిరాజు



మచిలీపట్నం :

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

యోగా గురువు శ్రీ ములక్ రాజ్ మహా రాజ్ వారి 127వ జయంతి పురస్కరించుకొని ఏపీ యోగా సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని గాంధీనగర్ లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనం నుండి యోగా సభ్యులచే బైక్ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని లక్ష్మీ టాకీస్ అంబేద్కర్ సర్కిల్, సాయిబాబా గుడి కోర్టు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్, కోనేరు సెంటర్ మీదుగా చింతగుంటపాలెం లోని దివ్య యోగా మందిర్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యోగా సాధన వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయన్నారు. యోగాతో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, కీళ్ల నొప్పులు తదితర వ్యాధులన్నీ ఎలాంటి ఖర్చు లేకుండా యోగా ద్వారా సహజ సిద్ధంగా నియంత్రించుకొని ఆరోగ్యంగా జీవనం గడపవచ్చన్నారు.

మచిలీపట్నంలోనీ 5 కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:00 వరకు ఒకరోజు కూడా అంతరాయం లేకుండా ఉచితంగా యోగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారని, తద్వారా చాలామంది ప్రయోజనం పొందుతున్నారన్నారు.

 ఈనెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు చింతగుంటపాలెంలోని ప్రధాన యోగా శిక్షణ కేంద్రం దివ్య యోగ మందిరంలో ఉత్తర భారత్ నుండి వచ్చిన యోగా నిష్ణాతులు దమయంతిజి వారిచే ప్రత్యేక ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

అనంతరం యోగా గురువులు జి గురునాథ్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి యోగా సాధన ఒక గొప్ప ప్రక్రియ అన్నారు. 

మచిలీపట్నం నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తర భారత దేశం నుండి యోగా నిష్ణాతులు దమయంతిజి గారు మచిలీపట్నంకు విచ్చేసి ఈనెల 5వ తేదీ సోమవారం నుండి 11వ తేదీ వరకు ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. ఈ మచిలీపట్నం ప్రజలందరికీ గొప్ప శుభవార్త మంచి అవకాశం అన్నారు. అంతేకాకుండా గురువుల ఆశీస్సులు పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు

ఈ ర్యాలీలో యోగా గురువులు జి మహాలక్ష్మి, మద్దాల చింతయ్య, వడ్డీ శ్రీనివాస్, యోగ సభ్యులు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, సూర్యనారాయణ, జగన్మోహనరావు, ఆర్ దుర్గాప్రసాద్, అశోక్ మాస్టర్, రాజకుమారి, రేఖ, పద్మావతి, బ్రహ్మం, భాస్కర్, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/0FVp_9dxsdw?si=N3OPrDfjZB_GMXGg

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...