Skip to main content

వ్యాపారవేత్తలు, వ్యాపార సంఘాలతో త్వరలో బిజినెస్ మీట్: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం:

        జిల్లాలో వ్యాపారవేత్తలు, వ్యాపార సంఘాలతో కలిపి బిజినెస్ మీట్ త్వరలో ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

       సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో బిజినెస్ మీట్ నిర్వహణపై సంబంధిత అధికారులతో  సమావేశం నిర్వహించారు. 

       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 
ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు వారికి సంబంధించిన ఉత్పత్తులు బాగా అమ్మకాలు పెరగడానికి మార్కెట్ లింకేజీ పటిష్టంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. బాగా సామర్థ్యం ఉన్న కొనుగోలుదారుల నుంచి వారికి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. 

       ఇందుకోసం జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యాపారవేత్తలతో జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఉన్నటువంటి వ్యాపార సంఘాలు, ఏజెన్సీలతో కలుపుకొని త్వరలో బిజినెస్ మీట్ నిర్వహించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 

       వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోగా అనుకున్న విధంగా లక్ష్యం నెరవేరాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా పిఎఫ్ఎంఈ పథకానికి సంబంధించి 156 యూనిట్లు నెలకొల్పవలసి ఉండగా ఇప్పటివరకు 32 మంజూరయ్యాయని, 21 యూనిట్లకు సంబంధించి మంజూరీలు బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయాలన్నారు.

        ఈ సమావేశంలో డిఆర్ఓకి చంద్రశేఖర రావు డిఆర్డిఏ పిడి హరినాథ్ ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి డిఐసి జిఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ పాపయ్య, ఖాదీ విలేజ్ బోర్డు ఏడి శరభల కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...