Skip to main content

ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ పగడ్బందీగా చేపట్టాలి –– జిల్లా కలెక్టర్


మచిలీపట్నం :

ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ పగడ్బందీగా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

శక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో కలిసి ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణపై (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బూత్ స్థాయి అధికారులు తదితర ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ చేయాలని, అదేవిధంగా 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2002 సంవత్సరంలో ఉన్న ఓటర్లతో వెరిఫై చేసి సంతాన (ప్రాజెనీ) మ్యాపింగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాలని అధికారులకు సూచించారు. 

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక ఓటరు, ఒక నియోజకవర్గంలో మాత్రమే ఓటు కలిగి ఉండేలా చూడాలన్నారు. వ్యక్తి మరణించినా, ఇతర ప్రాంతాలకు వలసపోయినా, ఓటర్ల వివరాలను పరిశీలించి వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించే విధంగా బిఎల్వోలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ బూత్ కు బిఎల్ఏ ను తప్పనిసరిగా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ నిర్వహించే సమయంలో ప్రతి బిఎల్వో ఎన్యుమరేషన్ ఫారంను ప్రతి ఓటర్కు తప్పనిసరిగా అందజేయాలని, అదేవిధంగా నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ నిర్వహించు సమయంలో మొదటి అప్పీల్ అధికారిగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్, రెండవ అప్పీల్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారని కలెక్టర్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు పోతురాజు(ఇంచార్జ్), జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, పలు జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...