Skip to main content

ఓఎన్‌జీసీ సిఎస్ఆర్ నిధులతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు – జిల్లా కలెక్టర్


కృత్తివెన్ను: 

          కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్ఆర్) కింద ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) అందించే నిధులతో గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

           మంగళవారం సాయంత్రం ఆయన కృత్తివెన్నులోని మండల తహసీల్దారు కార్యాలయంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ కలిసి ఓఎన్‌జీసీ సిఎస్ఆర్ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో చర్చించారు.

           చినపాండ్రాకలోని ఓఎన్‌జీసీ కార్యాచరణ ప్రాంతంలో (ఆపరేషనల్ ఏరియా) ఉన్న కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా చినపాండ్రాక, బంటుమిల్లి, కొమళ్ళపూడి, యండపల్లి, ములపర్రు, మల్లేశ్వరం తదితర గ్రామాలలో రహదారుల అభివృద్ధి, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు, ఫిల్టర్ బెడ్ల అభివృద్ధి, స్మశాన వాటికల అభివృద్ధి, ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరీక్ష పరికరాలు, కాలువ గట్ల బలోపేతం తదితర పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించారు. నిర్ణీత సమయంలో ఆయా పనులు చేపట్టని క్రమంలో నిధులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెండింగ్లో ఉన్న పనులకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ఓఎన్‌జీసీ అధికారులకు సమర్పించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

          సమావేశంలో బందరు ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు, ఓఎన్‌జీసీ హెచ్ ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు, ఎసెట్ సపోర్ట్ మేనేజర్ కె వి కె రాజు, జనరల్ మేనేజర్ శివకుమార్, ల్యాండ్ అక్విజేషన్ మేనేజర్ కిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆనంద్, తహసిల్దార్ శశి కుమార్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...