Skip to main content

కూటమి ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణం చేస్తోంది: మంత్రి జనార్దన్ రెడ్డి



మచిలీపట్నం :

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం 3,380 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణము, మరమ్మతు పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు,పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర రహదారులు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు లతో కలిసి బందరు ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు రహదారులు భవనాలశాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం పాత్రికేయల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్రానికి పలు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు రావడానికి మార్గం సుగమం చేశామన్నారు.
 రాష్ట్రవ్యాప్తంగా 1,081 కోట్ల రూపాయల వ్యయంతో 16వేల కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేశామన్నారు. 
రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరం 3,380 ఓట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టామని, ఇందుకోసం టెండర్లు ఇప్పటికే పిలిచామని, మరికొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయని, మరికొన్ని పనులు మొదలయ్యాయనీ చెబుతూ అన్ని కూడా నాణ్యతలో ఏమాత్రం లోటు లేకుండా వచ్చే మే నెల ఆఖరిలోగా పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో 160 కోట్ల రూపాయల వ్యయంతో 1,518 కిలోమీటర్ల మేరకు గుంతలు పడిన రహదారులను పూడ్చటంతో పాటు ఇతర మరమ్మతులను పూర్తి చేయడం జరిగిందన్నారు.

అందులో మచిలీపట్నం నియోజకవర్గంలో 33 కోట్ల రూపాయల వ్యయంతో 166 కిలోమీటర్ల రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు. 

అలాగే జిల్లాలో రహదారుల మరమ్మతుకు గాను పామర్రు నియోజక వర్గానికి 28 కోట్ల రూపాయలు, గన్నవరం నియోజకవర్గానికి 27 కోట్ల రూపాయలు, గుడివాడ నియోజకవర్గానికి 16 కోట్ల రూపాయలు, అవనిగడ్డ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు, పెనమలూరు నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు, పెడన నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.
ఈ నిధులతో పనులు రహదారుల మరమ్మతు పనులు ముమవరంగా ముమ్మరంగా చేపట్టి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
బందరు ఓడరేవు నిర్మాణాన్ని 50 శాతం పైగా పూర్తయిందని, ఇప్పటిదాకా 1760 కోట్ల రూపాయలు ఖర్చు అయినదని, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఇంకా 1700 కోట్ల రూపాయల మేరకు 42 శాతం పని మిగిలి ఉందని ఉందన్నారు.ఇకపై ప్రతినెలా సమీక్షించి ఎంత శాతం మేరకు పని పూర్తయిందో తెలుసుకుంటామన్నారు.

గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో. సాంకేతిక పరంగా కొన్ని సమస్యలు వచ్చాయ, ఈ సంవత్సరం జూన్ నెలాఖరికి పూర్తి చేస్తామన్నారు..
ఈ ప్రాంత వాసి హార్బర్ కోసం కృషిచేసిన పూర్వపు మంత్రివర్యులు నడికుదుటి నరసింహారావు పేరును హార్బర్ కు పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుముకత వ్యక్తం చేసి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా జారీ చేశారన్నారు.మచిలీపట్నంతో పాటు జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామమన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి హార్బర్ నిర్మాణం పురోగతిని సమీక్షించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో 46 కోట్ల రూపాయల వ్యయంతో పలు రహదారుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇందుకోసం నిధులు మంజూరు చేసిన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.  
గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం రహదారుల నిర్మాణం కానీ, మరమ్మతు గాని పట్టించుకోలేదన్నారు. 

తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రహదారుల మరమ్మతు ముఖ్యంగా గుంతలు పడిన రహదారులను పూడ్చివేశామన్నారు. 

మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తయి, కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. 
ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి పురోగతిని సమీక్షించి నిర్మాణం పనులు వేగవంతం చేస్తామన్నారు.

గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో సి మౌత్ కు సంబంధించి సరైన ఆకృతి లేక కొంత ఆలస్యమైందని ప్రస్తుతం చెన్నై ఐఐటీ నుండి ఆకృతులు వచ్చాయని ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు. 
వచ్చే మార్చి నెల 15 వ తేదీ నుండి వేట నిషేధం మొదలవుతుందనిx, జూన్ 15 నుండి హార్బర్ కార్యకలాపాలు మొదలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 
గతంలో 1999లో హార్బర్ నిర్మాణానికి కృషిచేసిన మాజీ మత్స్యశాఖ మంత్రివర్యులు నడికుదిటి నరసింహారావు పేరిట హార్బర్ కు నామకరణం చేస్తూ ప్రభుత్వం జీ.వో. విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, బందరు ఓడరేవు సి ఈ రాఘవరావు ఎస్సీ నగేష్ ఈఈ కెవి పుల్లారావు, రహదారులు భవనాల శాఖ సీఈ ఎన్ శ్రీనివాసరెడ్డి, ఎస్ ఈ భాస్కర్, ఈ ఈ లోకేష్, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇంచార్జ్ అధికారి తులసీదాసు
వచ్చే శాఖ జేడి మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా 
తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...