Skip to main content

వేసవిలో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.... కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం :

జిల్లాలో వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ సంస్థలకు మంజూరైన పారిశుధ్య సముదాయాలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ లో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవి ఎలాంటి మంచినీటి కొరత రాకుండా అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపుకోవడం జరిగిందని, ఏప్రిల్ మొదటి వారం వరకు వీటి ఎద్దడి లేకుండా గడపవచ్చన్నారు. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మంచినీటి రవాణా కు బదులుగా ఆ ప్రాంతంలో బోర్లు వేయాలన్నారు. జిల్లాలో ఏలూరు కాలువ పరిధిలో ఎనికెపాడు వద్ద దిగువ సొరంగం మూసివేసే పరిస్థితి ఉండడంతో దాని పరిధిలోని గన్నవరం, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో ఉన్న మొత్తం 31 సమ్మర్ స్టోరేజీ చెరువులను ముందుగానే నింపుకోవడం జరిగిందన్నారు. పలు సచివాలయాల్లో సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో సామూహిక పారిశుద్ధ్య ప్రాంగణాలు 697 మంజూరు కాగా 168 పూర్తయ్యాయని 210 పురోగతిలో ఉన్నాయన్నారు. అందులో 226 పనులు రద్దు చేయగా ఇంకా 93 పనులు అసలు మొదలు కాలేదన్నారు. ప్రభుత్వ సంస్థల పరిధిలోనీ మరుగుదొడ్ల నిర్మాణం ఆలస్యం చేయడం సరైనది కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను నిధి పోర్టల్ లో వెంటనే అప్లోడ్ చేసి చెల్లింపులు జరపాలన్నారు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా 650 మరుగుదొడ్లు మంజూరు చేయగా ఇప్పటికీ 98 మరుగుదొడ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు అన్ని సత్వరమే నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 477 గ్రామాలు ఉండగా అందులో ఇప్పటికే 459 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని, మిగిలిన 8 గ్రామాలను కూడా ఆ విధంగా ప్రకటించేందుకు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, మంచినీటి వసతి ఏర్పాట్ల కోసం మంజూరైన 61 పనులలో 3 పనులు పూర్తయ్యాయని, 36 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని మరో 22 పనులు ఇంకను మొదలు కాలేదన్నారు.పురోగతిలో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రారంభం కానీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఎంపీ లాడ్స్ కింద 18 పనులు మంజూరు కాగా అందులో ఇప్పటికీ 12 పనులు పూర్తయ్యాయని మిగిలిన 6 పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 8.60 కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో 53 పనులు మంజూరు కాగా అందులో 41 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. . వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జల జీవన్ మిషన్ కింద 455 పనులకు గాను ఇప్పటివరకు 409 పనులు పూర్తయ్యాయని మరో 32 పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయన్నారు వాటిని కూడా సత్వరమే పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్ డిఈఈ లు సుధాకర్, సత్యనారాయణ, ప్రసన్న, నారాయణరావు ఎస్ ఈ కార్యాలయం ఇంజనీర్ రత్న రావు పలువురు ఏఈలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...