Skip to main content

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి.....జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం :

        జనవరి 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు నగరంలోని చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 

     శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం శాఖ చింతగుంటపాలెం దివ్య యోగ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరం పై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాధన తో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు.

         అవయవాలు ఉన్నంతవరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంతవరకు ప్రాణాయామం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. యోగ సాధన తో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు ఉత్తర భారత్ నుండి విచ్చేయుచున్న యోగా నిష్ణాతులు, నిపుణులచే నిర్వహించ బడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
 
      అనంతరం ఏపీ యోగసభ మచిలీపట్నం శాఖ ప్రధాన కార్యదర్శి, యోగా గురువులు మాట్లాడుతూ యోగా గురువులు శ్రీ ములకరాజ్ జి మహారాజు వారి 127 వ జయంతి మహోత్సవములు పురస్కరించుకొని ఉత్తరాది నుండి వస్తున్న కార్యనిర్వాహక యోగాచారిణి దమయంతిజీ వారి సమక్షంలో ఈనెల 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. నిగూఢమైన అతి రహస్యమైన యోగా శాస్త్రమును బోధించి యోగ ప్రక్రియలను నేర్పించి లోక కళ్యాణార్థం ఆవిర్భవించిన మహాప్రభువు శ్రీరామలాల్ జి పరమ కృపకు పాత్రులైన వారు శ్రీ ములక్ రాజు జి మహారాజ్ వారన్నారు. శ్రీ ములకరాజ్ జీ వారు శ్రీరాంలాల్ ప్రభుజి వారి యోగ పరంపరలో యావత్ భక్తులందరికీ శిక్షణ ఇచ్చి తద్వారా శారీరక రుగ్మతలను పోగొట్టి మంచి ధ్యానస్థితిని ప్రసాదించినారన్నారు. 

      ఈ ఉచిత యోగా శిక్షణ శిబిరంలో 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం ఐదున్నర నుండి 8 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మందులు లేకుండా యోగ చికిత్స ద్వారా రక్తపోటు, మధుమేహం, సయాటికా నొప్పులు, కీళ్ల నొప్పులు ఆస్తమా నరముల బలహీనత, అధిక బరువు తదితర అనేక వ్యాధులను ప్రాణాయామములు యోగాసనములు ద్వారా నివారించేందుకు శిక్షణ ఇస్తామన్నారు. 

       ఈ శిక్షణ కార్యక్రమంలో స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా యోగ శిక్షణ తో పాటు చికిత్స చేస్తారన్నారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.  ఈనెల 11వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు తిలక ధారణ, 10 గంటలకు పురవీధులలో శోభాయాత్ర, అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు భోజన ప్రసాద వినియోగం ఉంటాయన్నారు. 

        ఈ కార్యక్రమంలో యోగా గురువులు జి గురునాథ్ బాబు, మద్దాల చింతయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, యోగ సభ్యులు ఆర్ దుర్గాప్రసాద్, జగన్మోహన్రావు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...