Skip to main content

రహదారి భద్రత పై ప్రత్యేక దృష్టి .... జిల్లా కలెక్టరు డీకే బాలాజీ

మచిలీపట్నం :

        జిల్లాలో రహదారి ప్రమాదాలను జరగకుండా నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. 
     
         సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో  జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం నిర్వహించి  సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలతో పోలిస్తే ఈ నెలలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయన్నారు.

         గత నెలలో 29 ప్రమాద సంఘటనలు జరుగగా 32 మంది చనిపోయారన్నారు. గన్నవరం ప్రాంతంలో గత నెల 18 వ తేదీ నాటికి 18 మంది చనిపోగా ఈ నెలలో 18వ తేదీ నాటికి 9 మంది మృత్యువాత పడ్డారన్నారు. రహదారులు ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నందున ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోకుండా వేగనిరోధకాలు అవసరమైన చోటల్లా ఏర్పాటు చేయాలన్నారు. 

        ముఖ్యంగా జాతీయ రహదారులు 216, 65 మార్గాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వాహనాల వేగం తగ్గించేందుకు అవసరమైన డ్రమ్ములను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రహదారి మార్గంలో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలన్నారు. డివైడర్ల మధ్యలో ఖాళీలు ఉండరాదని స్పష్టం చేస్తూ వాకర్ బ్రిడ్జిల దగ్గర ఫ్లెక్సీలు లేకుండా చూడాలని సీసీ కెమెరాలతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలు రాకముందే 100 మీటర్ల ముందర రంబుల్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. బెల్ కంపెనీ వద్ద, గండిగుంట పెట్రోల్ బంకు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినందున అక్కడ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 

          ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ వివి నాయుడు, ఆర్టీవో శ్రీనివాసరావు, డిపిటివో వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, జాతీయ రహదారుల పిడి విద్యాసాగర్, మోర్త్ ఏఈ అనుదీప్, డిఎస్పి సిహెచ్ రాజా, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, ఎంవిఐలు సిద్ధిక్, సుబ్బారావు, నారాయణస్వామి, సంగీతరావు, ఏఎంవిఐలు సోనిప్రియ అయిషా తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...