Skip to main content

గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి: అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం:

జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయుటకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు.

మిగిలిన గృహాలలో 719 గృహాలు బిబిఎల్ దశలో, 2770 గృహాలు బి ఎల్ దశలో, 119 గృహాలు ఆర్ సి దశలో ఉన్నాయన్నారు. ఈనెల 8 వ తేదీన సమీక్షించినప్పటి నుండి ఇప్పటివరకు సరైన పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైకప్పు దశ నుండి రూఫ్ క్యాస్ట్ దశ వరకు కేవలం 30ఇళ్లు మాత్రమే వచ్చాయన్నారు. ఆర్సీ నుండి కేవలం 18 గృహాలు మాత్రమే పూర్తి స్థాయికి వచ్చాయన్నారు.
కృత్తివెన్ను, నందివాడ, గుడివాడ, ఉయ్యూరు తదితర మండలాల్లో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గృహ నిర్మాణం పురోగతిపై పదేపదే సమీక్షిస్తున్నారని, ఉగాది నాటికి అన్ని గృహాలు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. గృహాల నిర్మాణంలో ఆలస్యం చేస్తే ఆ పథకం ముగిసిపోతుందని హెచ్చరించారు.

గృహ నిర్మాణంలో ఎంపీడీవోలు గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమన్వయం చేసుకొని నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారు.

పెడన మండలంలో తక్కువ దశలో ఉన్న ఇంటికి ఎక్కువ దశలో ఉన్నట్లుగా చూపి బిల్లు చెల్లింపు చేయడం సరైనది కాదని హెచ్చరిస్తూ అందులకు బాధ్యులైన వారికి వెంటనే షో కాస్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలని స్పష్టం చేశారు. 

గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యదర్శులను వినియోగించి చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం జిల్లాలో కేవలం 10 శాతం పూర్తి అయిందని, ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వేని మరింత ముమ్మరం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఈ ఈ వెంకటరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, గ్రామ వార్డు సచివాలయాల సమన్వయకర్త రవికాంత్, మండల ప్రత్యేక అధికారులు జెడ్పి డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, డిఈఓ సుబ్బారావు, వయోజన విద్య డిడి బేగ్, పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డి ఎల్ డి వో లు పద్మ, రాజేషు, సునీత శర్మ, పలువురు ఎంపీడీవోలు గృహ నిర్మాణ సంస్థ డీఈలు, ఏఈ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...