Skip to main content

ఎస్సీ కార్పొరేషన్ వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి –– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్



మచిలీపట్నం: 

         ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ కోరారు. 
          బుధవారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో భూమి కొనుగోలు పథకం లబ్ధిదారులు, నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ ఎఫ్ డి సి), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ కేఎఫ్డిసి) పథకాల లబ్ధిదారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ సద్వినియోగంపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
          ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ 2015–16 నుండి 2018–19 మధ్య కాలంలో ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ కేఎఫ్డిసి పథకాల ద్వారా రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు, 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు రుణం మొత్తం చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేయబడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 
           జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తీసుకున్న రుణానికి వడ్డీ కాకుండా అసలు మాత్రమే చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించిందని, ఇది ఎంతో లబ్ధి చేకూరుతుందని, సద్వినియం చేసుకోవాలన్నారు. దీనివల్ల సిబిల్ స్కోర్ కూడా మెరుగవుతుందని, భవిష్యత్తులో రుణాలు పొందడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 

           ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మగినం స్వతంత్రరావు 2018–19 కాలానికి సంబంధించిన ట్రాక్టర్ రుణం రూ.2.50 లక్షలు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కార్పొరేషన్ కార్యాలయంలో చెల్లించగా లబ్ధిదారున్ని వారు ప్రత్యేకంగా అభినందించారు.

         సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రమేష్, సోషల్ వెల్ఫేర్ డిడి సాహిత్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఎస్సీ కార్పొరేషన్ ఈవో సెల్వి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...