Skip to main content

ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు: జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు


మచిలీపట్నం:

జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. 

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు డిఆర్ఓ నగరంలోని తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు మూడు దశల్లో జరుగుతాయన్నారు.

మొదటి దశలో నీతి, మానవ విలువల పై పరీక్ష మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 21వ తేదీన 128 జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు.


ఇంటర్మీడియట్ వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27వ తేదీ నుండి వచ్చే ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, ఇంకొక సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు.

జిల్లాలో సాధారణ ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వృత్తివిద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 

జిల్లాలో సాధారణంగా వృక్ష ,జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల పరీక్షలకు సంబంధించి మొత్తం 27,161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు.

వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులు 1,868 మంది పరీక్షలకు కానున్నారన్నారు.

ఇంటర్మీడియట్ థియరీ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి నెల 23వ తేదీ నుండి మార్చి నెల 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు.ఈ థియరీ పరీక్షలు జిల్లాలోని 63 కేంద్రాలలో జరుగుతాయన్నారు.
ఈ పరీక్షలకు మొదటి రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కంట్రోల్ విభాగాన్ని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని పరీక్షలు సంపూర్ణ పర్యవేక్షణ చేయాలన్నారు.

సిట్టింగు, ఫ్లయింగ్ స్క్వేర్లు అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు పర్యవేక్షించాలన్నారు.

అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్తు, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.

పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 163 భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ ను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, పరీక్షల కన్వీనర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సరళ కుమారి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...