Skip to main content

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి–– జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి



మచిలీపట్నం :

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు లోనై జీవితాలను దుర్భరం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి యువతకు పిలుపునిచ్చారు.శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, విద్యార్థులతో కలిసి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి నగరంలోని సాయిబాబా గుడి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించి యువత భవిష్యత్తును కాపాడేందుకు జాతీయ న్యాయసేవాధికార సంస్థ (ఎన్ఎల్ఎస్ఏ) డ్రగ్స్ అవేర్నెస్ వెల్నెస్ నావిగేషన్ (డాన్) అనే పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎన్ఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశం భారత్ అని, అయితే దేశంలోని యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపద దేశ సంపదని పేర్కొంటూ అటువంటి విలువైన సంపదలో యువతది కీలక పాత్ర అని, అటువంటి యువత జీవితాలు చెడు వ్యసనాలకు లోను కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తద్వారా ఇది దేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. దాదాపు 75 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే గమనిస్తున్నారు గాని, అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించడం లేదని, ఇది కేవలం, యువత చెడు వ్యసనాలకు లోనై వాటి దుష్ప్రభావాలతో యువత నిర్వీర్యం కావడం కారణం అని పేర్కొన్నారు. యువత అనేక రకాల మత్తు పదార్థాలకు లోను కాకుండా ఉండేందుకు, తమ పిల్లలు సరైన మార్గంలో పయనించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అదేవిధంగా పాఠశాల, కళాశాల యాజమాన్యాలు పరిశోదాత్మకంగా పరిశీలిస్తూ విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు. 

కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్, తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ సుజాత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు తదితర న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...