Skip to main content

ప్రజా ఫిర్యాదుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు.... జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.



మచిలీపట్నం :

     మీకోసం కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై చట్టపరిధిలో పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. 

       ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలను సానుకూలంగా విని పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. మీకోసం కార్యక్రమం ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, చట్టపరిధిలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి పరిష్కారం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల సమస్యలతో మొత్తం 30 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో జిల్లా ఎస్పీ కి సమర్పించారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేసి, పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం మీకోసం కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల వివరాలు.

పెనమలూరు నుండి సావిత్రి అనే మహిళా వచ్చి తనకు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుందని తన వివాహ జీవితంలో ఒక కుమారుడు, కుమార్తె కలగగా తను అత్తింటి వారు అదనపు కట్నం కోసం తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నాడని తన భర్త దుర్వ్యసనాలకు బానిసై భౌతిక దాడికి పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు. 

బంటుమిల్లి నుండి ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమికి సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్ళనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నాడని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు. 
 
 అవనిగడ్డ నుండి నరసయ్య అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ అవసరాల నిమిత్తం దగ్గర బంధువుల వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నానని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అధిక వడ్డీ పేరుతో ఎక్కువ మొత్తం కట్టాలని వేధిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...