Skip to main content

పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి –– జాయింట్ కలెక్టర్



మచిలీపట్నం :

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఇంచార్జి డీఆర్ఓ కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు డీఎస్పీ చప్పిడి రాజా, మెప్మా పీడీ సాయిబాబుతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వద్ద 272 అర్జీలు, పోలీస్ 72, విద్యుత్ శాఖ వద్ద 56 అర్జీలు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయని, దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు వచ్చిన అర్జీలపై తప్పనిసరిగా సమీక్షించుకుని వెళ్లాలని సూచించారు. ఎండార్స్మెంట్ సరైన రీతిలో చేయకపోతే అర్జీలు ఓపెన్ అవుతున్నాయని, సక్రమంగా చేయాలని చెబుతూ మండల స్థాయి అర్జీలను సైతం పర్యవేక్షించాలని చెప్పారు. కొంతమంది అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి గైర్హాజరవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి షోకాస్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు సూచించారు.

అర్జీలలో కొన్ని: 
కూడబెట్టుకున్న డబ్బుతో 300 మంది పోస్ట్ ఆఫీస్ నందు పొదుపు చేసుకున్నామని, అయితే మా గ్రామ పోస్టుమ్యాన్ ఆ నగదును మా ఖాతాల్లో జమ చేయకుండా మోసం చేసి నగదు, పాస్ పుస్తకాలతో పరారయ్యాడని, ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న ఆ పోస్టు మ్యాన్ నుంచి నగదును ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంగుటూరు మండలం, ఉంగుటూరు గ్రామానికి చెందిన పలువురు మహిళలు అర్జీ సమర్పించారు. భర్త మరణించి వృద్ధురాలైన తనకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం కలదని, వారందరికీ ఆస్తి పంపకాలు చేశానని, అయితే తన బాగోగులు పట్టించుకోకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తనపై ఒత్తిడి పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరగా, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్టీవోకు సూచించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి పేద, మధ్య తరగతికి చెందిన వందలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో భోజన మెస్సులు ఏవి లేవని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మచిలీపట్నంకు చెందిన సైకం భాస్కర్ రావు అర్జీ ఇచ్చారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...