Skip to main content

మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష



మచిలీపట్నం:

మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నగరంలోని రహదారులు భవనాలు అతిథి గృహంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వsహించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. 
ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన గృహ నిర్మాణ పథకం, మచిలీపట్నం నగరపాలక సంస్థ, ముడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రివర్యులు జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో 6,185 ఇంటి ప్లాట్ లకు గాను 4,550 ఇల్లు మంజూరు చేసి కేటాయించగా 2010 ఇల్లు కొన్ని పూర్తయి మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు.
అలాగే పట్టణ ప్రాంతంలో 20,602 ఇళ్ల ప్లాట్లకు గాను 15,588 ఇళ్ళు మంజూరు చేసి స్థలాలు కేటాయించగా 3,018 ఇల్లు కొన్ని పూర్తికాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. పురోగతిలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఖాళీగా ఉన్న ప్లాట్లను, ఇంకా నిర్మాణం మొదలుపెట్టని ఇళ్ల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. మునిసిపల్ పరిధిలో వివిధ మురికి కాలువలు, రహదారుల నిర్మాణ పనులను ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన సత్వరమే పూర్తి చేయాలన్నారు 
.
నియోజకవర్గంలో అందరు ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా వాటి ఆధారంగా వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వారందరినీ ప్రోత్సహించేందుకు వీలుగా అవసరమైన స్థలాలను వెంటనే కేటాయించుటకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

అలాగే నియోజకవర్గంలో మంగినపూడి బీచ్ ఆధారంగా పర్యాటక అభివృద్ధికి సంబంధించిన వివిధ పనులను చేపట్టే దిశగా ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, ప్రజారోగ్య శాఖ ఈ ఈ ప్రవీణ్, ముడా కార్యాలయ సిటీ ప్లానర్ సుగుణ కుమారి, తహసిల్దారు మధుసూదన్ పలువురు ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...