Skip to main content

మచిలీపట్నం బీచ్ అభివృద్ధే లక్ష్యంగా మసులా బే పార్కు



మచిలీపట్నం :

        మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా మసులా బే పార్కు ఏర్పాటు జరిగింది. ఈ మేరకు 11 మందితో నూతన కమిటీ ఏర్పడగా తొలి సమావేశం మచిలీపట్నంలోని డాక్టర్ పట్టాభి సీతారామయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు.

        కమిటీకి నూతన అధ్యక్షులుగా నియమితులైన గొర్రెపాటి శ్రీనివాస్ చందు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ తోపాటు మచిలీపట్నం సర్వతో మఖాభివృద్ధి కోసం ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన 11 మందిని ఎంపిక చేసి కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం జరిగిందన్నారు. 
 
        వీరంతా స్వచ్ఛందంగా బీచ్ మరియు మచిలీపట్నం తో పాటు కృష్ణాజిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తారన్నారు. తాను ఈ కమిటీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించడానికి అంగీకరించానన్నారు.అలాగే వైస్ ప్రెసిడెంట్ గా రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్, జనరల్ సెక్రెటరీగా నడుకుదిటి నిఖిత, ట్రెజరర్ గా గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు వ్యవహరిస్తారన్నారు. మిగిలిన సభ్యులు ఈసీ మెంబర్లుగా కొనసాగుతారని చందు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ పని చేస్తుందన్నారు. 

        బీచ్ లో ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు తద్వారా మచిలీపట్నం అభివృద్ధికి అది ఏ విధంగా దోహద పడతుందనే అంశాలను పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే దీనిపై సమగ్ర అవగాహనతో ఉన్నామన్నారు. కమిటీ సభ్యులతో పాటు ప్రజల్ని భాగస్వాములు చేసి మచిలీపట్నం అభివృద్ధికి పాటుపడతామన్నారు. 

          కమిటీలో నియమితులైన 11 మందిని ఈ సందర్భంగా పరిచయం చేశారు. వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన వారుగా చందు పేర్కొన్నారు. మా అందరి లక్ష్యం మచిలీపట్నం అభివృద్ధి జరగాలనీ, అలాగే బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ఉన్నామని కమిటీ సభ్యులంతా ముక్తకంఠంతో చెప్పారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...