Skip to main content

కార్యకర్త కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శ


మచిలీపట్నం :

       అవయవాల దానం చేసిన చందు వీర వెంకట వసంతరాయల కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

        బుధవారం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని పెద్ద చందాల గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, అవయవాలు దానం చేసిన చందు వీర వెంకట వసంత రాయలు స్వగృహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. 
           వసంత రాయలు గత సంవత్సరం జూలై మాసం 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర దిగమర్రు గ్రామంలో రహదారి ప్రమాదానికి గురై గుంటూరులోని ఈస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 3 వ తేదీన మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతని 6 అవయవాలను జీవనధార్ వెబ్సైట్ ద్వారా దానం చేశారు. 

          ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం వసంతరాయులు ఇంటికి వచ్చి అతని సతీమణి నాగ పుష్పవతి(45),కుమారుడు సీతారామరాజు (25),కుమార్తె జాహ్నవి (21) లను కలిసి వసంత రాయల చిత్రపటానికి పూలమాల వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

         ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వసంత రాయలు కుటుంబ సభ్యులను ఓదార్చి, పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు అని వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందజేసే రూ.5 లక్షల బీమా చెక్కును రాయలు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అందచేశారు. 
        అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పుట్టెడు దుఃఖం గుండెల్లో పెట్టుకొని అవయవాల దానానికి ముందుకు వచ్చిన వసంతరాయుల కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అతని కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాటలు రావని తెలుసుకున్నానని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సహాయం అందించాలని అధికారులకు సూచించామన్నారు.

        ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, పెడన అవనిగడ్డ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, జెడ్పి సిఈఓ కన్నమ నాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీఎఫ్ఓ సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ రావు, ఎన్ ఐ సి డి ఐ ఓ పని కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ,మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ చైర్మన్ తులసిరావు , తహసిల్దార్ శశి కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావు, స్థానిక నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, పంతం వెంకట గజేంద్రరావు, నర్సాపురం మాజీ ఎంపీపీ కనకరాజు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...