Skip to main content

ప్రజల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కారం మీకోసం - జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు.

మచిలీపట్నం :

ప్రజలు ఎదుర్కునే సమస్యకు పరిష్కారం , చట్ట పరంగా న్యాయం అందించడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి మీ సమస్యలు చట్టపరిధిలో నిర్ణీత సమయంలోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి అందిన ఫిర్యాదులలో కొన్ని అవనిగడ్డ నుండి రాణి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 5 సంవత్సరాలు అయిందని, ఇద్దరు ఆడపిల్లలు కలిగారని అయితే అత్తింటివారు ఆడపిల్లల పుట్టారనే నెపంతో పుట్టింటికి పంపివేసి తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నారని, అంతేకాక నాకు బలవంతంగా విడాకులు ఇవ్వాలని చూడడమే కాక నా చదువుకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇతరత్రా విలువైన పత్రాలు నగలు అన్నింటిని వారివద్దే ఉంచుకొని నా పిల్లలకు అన్యాయం చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు. పెనమలూరు నుండి నాంచారయ్య అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు మగ పిల్లలని, పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడని, అతని భార్య అత్తమామలమనే కనికరం కూడా లేకుండా ఆస్తికాచెయ్యాలనే దురుద్దేశంతో మా ఆస్తిని కాజేయాలని చూస్తూ మనశాంతిగా బ్రతకనీయకుండా మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని వారి బంధువులను తీసుకువచ్చి మాపై భౌతిక దాడికి పాల్పడుతుందని న్యాయం చేయమని ఫిర్యాదు. మచిలీపట్నం నుండి చందు అనే యువతీ వచ్చి తాను బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటుండగా వారి దగ్గర బంధువుల లో ఒకరు ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఉందని, దానికి కొంత డబ్బు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందని నమ్మ పలికి దఫ దఫాలుగా మొత్తం 3 లక్షలు ఇవ్వడం జరిగిందని, డబ్బులు చెల్లించి చాలా కాలమైనప్పటికీ ఎటువంటి సమాచారం లేదని, అదేమని అడిగితే అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
 గుడివాడ నుండి రామారావు అనే వ్యక్తి వచ్చి తన కుమార్తెను తన సొంత బంధువకే ఇచ్చి వివాహం జరిపించి వివాహ సమయంలో కట్న కానుకలన్నీ ఇవ్వడం జరిగిందని, అయితే వేరొక మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని తన కుమార్తెను కడుపున పుట్టిన బిడ్డను హింసిస్తున్నాడని అంతేకాక విడాకులు ఇచ్చి వేరొక వివాహం చేసుకోవాలని ఇంటి నుండి గెంటివేసాడని న్యాయం చేయమని ఫిర్యాదు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...