Skip to main content

గృహ నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలి..... డీకే బాలాజీ


మచిలీపట్నం:

  జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్బిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అసలు సమస్య ఏమిటనీ ప్రశ్నించారు. పైకప్పు స్థాయి( ఆర్. ఎల్) లో 1,795 గృహాలు ఉండగా వాటిల్లో కేవలం 19 గృహాలు మాత్రమే రూఫ్ కాస్టింగ్ కు (ఆర్ సి) వచ్చాయన్నారు. కనీసం పై కప్పు స్థాయి నుండి రూప్ క్యాస్టింగ్ స్థాయి వరకు చేయలేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీతో ఈ గృహ నిర్మాణ పథకం అంతం అవుతోందని, ఆలోపే అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి గృహ నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులను సంబంధిత లబ్ధిదారులకు చెల్లించాలని ఆదేశించారు. 

లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోతే అందుకు బాధ్యత సంబంధిత అధికారులే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం పనుల కాలంలో పనులు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు.జిల్లాలో 1,015 ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలుపెట్టలేదన్నారు. ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారికి ఆ ఇల్లు అవసరమా లేదా అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.

కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే మిగిలాయని ఈ విషయం చాలా తీవ్రంగా పరిగణించి గృహ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. సిమెంటు, ఇనుము తదితర గృహ నిర్మాణ సామాగ్రిలో ఏమైనా తేడాలు ఉన్న అవకతవకలకు పాల్పడిన బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ అధికారి పోతురాజు, ప్రత్యేక అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, డిఎస్ఓ మోహన్ బాబు, పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు, గృహ నిర్మాణ సంస్థ ఈఈ వెంకటరావు, డి ఎల్ డి ఓ పద్మ, ఎంపీడీవోలు పలువురు డి ఈ ఈ లు, ఏ ఈలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...