Skip to main content

విశ్రాంతి భవనం పునః ప్రారంభించాలి.... బీసీ సంఘం డిమాండ్

మచిలీపట్నం :

        అధికారులు రోగుల పట్ల విజ్ఞతతో మెలుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న విశ్రాంతిభవనాన్ని మరలా ప్రారంభించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకు బోయిన సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.

       స్థానిక ఈడేపల్లి లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం లో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సౌకర్యార్థం 2020లో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సమయంలో 20 లక్షల వ్యయంతో ప్రస్తుతం ఉన్న సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్రాంతి భవనాన్ని నిర్మించడం జరిగింది,ఎంతో మంది చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా వారికి సహాయర్థం ఎవరో ఒకరు వస్తారు. వారు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ భవన నిర్మించడం ఆనాడు జరిగింది,రోగి తరపున వచ్చిన బంధువులు భోజనాలు చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యార్థం ఆ భవనాన్ని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. దాన్ని ప్రస్తుతం ల్యాబ్ కింద వాడుకోవడం చాలా దారుణమని అన్నారు.

       ప్రస్తుతం రోగుల కోసం వచ్చేవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఆ ప్రాంతంలో ఏ విధమైన సౌకర్యాలు లేవు దానివల్ల వచ్చిన రోగుల బంధువులు నానా ఇబ్బందులు పడాల్సి అనే ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల వ్యయంతో ఆనాడు మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల్ని వెచ్చించగా నేడు పాలకవర్గం రోగి బంధువుల ఇబ్బందులను పట్టించుకోకుండా చూడడం చాలా దారుణం. రోగితరు బంధువులు విశ్రాంతిభవనం లేకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ భోజనాలు చేసి ఆ ప్రాంతాన్ని అంతా ఇబ్బంది గురయ్యాలా చేస్తున్నారు? ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ల ఇబ్బందులను ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ దృష్టిలో ఉంచుకొని ఆ ల్యాబ్ ను ఖాళీ చేయించి రోగుల కు, రోగి బంధువులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆవిడ పై ఉందని బీసీ సంక్షేమం తరఫున మా అభిప్రాయమని ఆయన అన్నారు. 

     ప్రస్తుతం మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించాలని నా విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జోగి శివ, భోగి రెడ్డి సుభాని, నిక్క రాధాకృష్ణ, బెల్లంకొండ రవి, బోయిన సాంబ, ఎం రామరాజు, చేయబోయిన కోటేశ్వరరావు, బోయిన రమేష్, ఎం గోపి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...