Skip to main content

ప్రజా సమస్యల పరిష్కార వేదిక---మీకోసం అర్జీలు 75

మచిలీపట్నం:

        సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, పి టి సి డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక---మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

          
      కలెక్టరేట్లో మొత్తం 75 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది.. 

అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

       గుడివాడ మండలం పర్నాసి గ్రామ కాపురస్తులు పల్లపోతు ఏడుకొండలు మాట్లాడుతూ తన ఇల్లు పర్నాస గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి నుండి ఎదురుగా ఉన్న చెరువు వద్దకు రెండు బజారుల మధ్య కలదని, తన ఇంటికి రెండు పక్కల వైసీపీ పార్టీ వారు ఉంటారని, తన ఇంటికి బజారు గుండా వెళ్ళవద్దని బైకులకు రోడ్లమీద గండి కొట్టి ఆటో కూడా రానివ్వకుండా బజారులో నడపడానికి వీలు లేదని గొడవ చేస్తున్నారన్నారు. కలెక్టర్కు, ఎంపిడిఓ కు ఎన్నిసార్లు అర్జీలు పెట్టిన గ్రామ సర్పంచ్ వైసీపీ పార్టీ వారు అయినందున సచివాలయం సిబ్బంది కేసు పెట్టిన పోలీస్ వారిని రానివ్వడం లేదని బజారు ద్వారా వెళ్ళు హక్కును కల్పించి అడ్డు తగులుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ అందజేశారు.

     పశ్చిమ బెంగాల్ కు చెందిన బోని అమిన్ పైక్ అర్జీ అందజేస్తూ రాము ఇప్పుడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో నివసిస్తున్నామని, 2023 సంవత్సరంలో మొవ్వ పంచాయతీ పరిధిలోని జయలక్ష్మి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తనతో పాటు 30 మంది కార్మికులు రొయ్యల విభాగంలో పనిచేసామని, తమకు కూలీలకు సంబంధించిన 80 వేల రూపాయల బకాయిలను చెల్లించకుండా అక్రమంగా నిలిపివేశారని, ఆ కూలి డబ్బు అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

           ఉంగుటూరు మండలం పెద్దఔటుపల్లి గ్రామానికి చెందిన మండవల్లి శ్రీవల్లి తాను గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 1990 సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీన 1982/1990 దస్తావేజు నంబర్లో స్థలం కొనుగోలు చేశామని తనకు సంపూర్ణ హక్కు ఉన్నదని తన ఆస్తికి తూర్పు వైపున ఆగ్నేయ మూలన జంగం రామారావు అనే వ్యక్తి స్నానపు గది అక్రమంగా నిర్మించి తన రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని, తాను అక్కడ నూతన నిర్మాణం చేపట్టుటకు ఇబ్బంది కలుగుతుందని అక్రమ నిర్మాణాన్ని తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందచేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...