Skip to main content

క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.. –– మంత్రి వాసంశెట్టి సుభాష్



గుడివాడలో 69వ జాతీయ పాఠశాల అండర్ -14 బాలికల కబడ్డీ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా ఇంచార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్

గుడివాడ: 

        క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడల్లో గొప్పగా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ క్రీడాకారులకు ఉద్బోధించారు.

        స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడివాడలోని నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న 2025-2026 సంవత్సర 69వ జాతీయ పాఠశాల అండర్ -14 బాలికల కబడ్డీ క్రీడా కార్యక్రమంలో సోమవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి గాల్లోకి బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం వారు తెలంగాణ, నవోదయ విద్యాలయ సంఘటన్ జట్ల మధ్య జరిగిన తొలి కబడ్డీ మ్యాచ్ను తిలకించారు. తొలుత మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు సరదాగా కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. 
         కార్యక్రమంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక స్థైర్యం, పోటీ తత్వాన్ని, ఓటమిని స్వీకరించే క్రీడా స్ఫూర్తిని నేర్పిస్తాయని, అవి మనిషి జీవిత ఎదుగుదలకు ఎంతో తోడ్పాటునందిస్తాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పాఠశాలల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్పగా రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.

          శాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముందు తర్వాత క్రీడలను ఎంతో ప్రోత్సహించి క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు క్రీడలపై మక్కువతో ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించి క్రీడలను ప్రోత్సహించారన్నారు.

        ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ వంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని ఆకాంక్షించారు.

        శాసనసభ్యుడు వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయస్థాయి క్రీడలు నిర్వహించటం గుడివాడకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

        కార్యక్రమంలో నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ భానుమూర్తి, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు సిహెచ్ రవి, పొట్లూరి రవి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్, డీఈవో యు వి సుబ్బారావు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, క్రీడాకారులు, క్రీడా శిక్షకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...