Skip to main content

2026–27 సంవత్సర ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ అంచనా బడ్జెట్ను ఆమోదించిన జెడ్పీ పాలకవర్గం..




జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు..

మచిలీపట్నం: 

       గురువారం జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం 2025–26 సంవత్సర సవరణ బడ్జెట్, అదేవిధంగా 2026–27 సంవత్సర అంచనాల బడ్జెట్ను ఆమోదించారు.

        కృష్ణా జిల్లా ప్రజా పరిషత్, 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.143,97,36,614 కాగా ఆదాయము అంచనా రూ.817,82,04,492 గాను ఖర్చు అంచనా రూ.841,44,99,492 కాగా ముగింపు నిల్వ అంచనా రూ.120,34,41,614 గా చూపారు.

        అదేవిధంగా 2026-27 సంవత్సర బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.120,34,41,614 కాగా ఆదాయము అంచనా రూ.2140,12,78,469 గాను ఖర్చు అంచనా రూ.2123,99,95,149 కాగా ముగింపు నిల్వ అంచనా రూ.136,47,25,114 గా చూపించారు.

           తొలుత జరిగిన స్థాయి సంఘ సమావేశాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, స్త్రీ సంక్షేమం రక్షణ, ప్లానింగ్ ఆర్థికం, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా అంశాలపై సభ్యులు సమస్యలను లేవనెత్తగా సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు.

           మొవ్వ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్న వసతి భవనాన్ని కూల్చివేశారని, ఈ విషయంలో ఆ శాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు జడ్పీ సీఈఓను కోరారు.

         ఎన్టీఆర్ జిల్లాలోని కొంతమంది రైతులకు గత సంవత్సర ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన రవాణా చార్జీలు ఇప్పటికీ చెల్లించలేదని కొంతమంది సభ్యులు సమస్యలు లేవనెత్తగా, అట్టి రైతుల జాబితాను సమర్పించాలని దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల జిల్లా మేనేజర్ తెలిపారు. 

        దాల్వ పంట లేక కృత్తివెన్ను మండలంలో చాలా పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయని, అందుకు ప్రత్యామ్నాయ అనువైన పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించలేదని మండల జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా మండలంలోని చినగొల్లపాలెం గ్రామానికి తాగునీరు అందడం లేదని, వచ్చే వేసవి నాటికి ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని, ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. కంచికచర్ల మండలంలో సైతం మంచినీటి పైపులు తుప్పు పట్టి పాడైపోయాయని, సరిగా నీటి సరఫరా జరగడంలేదని, మరమ్మతులు చేపట్టాలని ఆ మండల సభ్యురాలు సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చారు.

          ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు, నూజివీడు మండలాల్లో అత్యధికంగా మామిడి సాగు చేస్తున్నారని, అయితే నకిలీ పురుగు మందులతో రైతులు మోసపోతున్నారని, సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా యూరియా కొరత లేకుండా చూడాలని సభ్యులు కోరారు.

         తమ సమస్యలను చెప్పుకునేందుకు జెడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు హాజరుకావడం లేదని, ప్రతిసారి ఇలాగే జరుగుతోందని, ఇకనైనా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారిక సమావేశాలకు అధికారులు ఇప్పటకీ ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు సభ్యులు జెడ్పీ సీఈవో దృష్టికి తెచ్చి అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించాలని పై అధికారులు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి అధికారులు ఆదేశాలు పాటించడం లేదని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

         రూ. 1.25 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ సమావేశపు మందిరం, చైర్ పర్సన్ చాంబర్, సీఈవో ఛాంబర్, మరుగుదొడ్లు తదితర విభాగాలను ఆధునికరించేందుకు బడ్జెట్ కేటాయించామని, అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయని జడ్పీ చైర్పర్సన్ ఈ సందర్భంగా తెలిపారు. 

           సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, బందరు ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు, వివిధ ప్రభుత్వ శాఖల ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...