Skip to main content

జిల్లా వ్యాప్తంగా గ్రామ ఆరోగ్య వనాలు


మచిలీపట్నం:

జిల్లా వ్యాప్తంగా గ్రామ ఆరోగ్య వనాలు ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. 

బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ముంగిట కార్యదర్శి అశోక్ చొరవతో ఏర్పాటుచేసిన గ్రామ ఆరోగ్యవనాన్ని ప్రారంభించి అందులో పెంచుతున్న సర్పగంధ, బ్రాహ్మి, రణపాల, మధునాసిని, శతావరి, కుషింద గుంటగరగరాకు, కలబంద వంటి ఔషధ మొక్కలను పరిశీలించారు. 

తదుపరి అదే గ్రామంలో సర్పంచ్ శివ పార్వతి కృషితో చెత్తాచెదారాలను తొలగించి ఏర్పాటుచేసిన పార్కును జిల్లా కలెక్టర్ సందర్శించి అందులోని బల్లపై ఆమెతో కలిసి కూర్చొని కాసేపు ముచ్చటించారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఔషధ మొక్కలతో గ్రామ ఆరోగ్యవనాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని కాలువ గట్టులపైన, చెరువుల చుట్టూ ఇటువంటి మొక్కలను విరివిగా పెంచడం వలన స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు.
పూర్వపు గ్రామీణ ఔషధ విజ్ఞానాన్ని పునరుద్ధరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. ఇందులో భాగంగా అరుదైన అంతరించిపోతున్న ఆయుర్వేద మొక్కలను సేకరించుకొని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అలాగే గ్రామంలోని చెత్తకుప్పలను డంపింగ్ యార్డులను గ్రామ సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతి పంచాయతీ నిధులతో కాకుండా సొంత ఖర్చుతో తొలగించి పార్కులుగా అభివృద్ధి పరచడం స్ఫూర్తిదాయకమన్నారు. తద్వారా గ్రామ ప్రజలకు ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. దాంతో ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చన్నారు.

ఇదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలో కూడా గ్రామ ఆరోగ్యవనాలను ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ ఆరోగ్యవనం ఏర్పాటు చేసినందుకు, గ్రామ సేవ కింద పార్కును ఏర్పాటు చేసినందుకు కార్యదర్శి ఆది అశోక్ ను, గ్రామ సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. పార్కులోని మొక్కలు ఎండిపోకుండా నిరంతరం వాటికి నీరు పోసి బతికిస్తున్న తోటమాలి లంకె కృష్ణారావును కూడా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దారు ఆంజనేయ ప్రసాదు, ఎంపీడీవో ఎం చంద్రశేఖర్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆది అశోక్, సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతి , వారి భర్త శ్రీనివాసరావు, నీటి పంపిణీ కమిటీ అధ్యక్షులు నాగ మల్లికార్జునరావు తదితర అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...