Skip to main content

మీ కోసం సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు

మచిలీపట్నం:

ప్రపంచంలో ప్రేమ శాంతి ప్రబోధించిన కరుణామయుడు ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కీర్తించారు. 

బుధవారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిల్లల చేత కేక్ కట్ చేయించి వారికి తినిపించారు. అనంతరం వారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యేసు ప్రభువు అంటేనే గుర్తుకొచ్చేది స్వచ్ఛమైన ప్రేమ అన్నారు.

ప్రపంచంలో శత్రువుతో సహా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రేమించాలన్నదే ఏసు ప్రభువు సందేశం అన్నారు. తనను శిలువ పైకి ఎక్కించిన వానిని కూడా క్షమించిన గొప్ప మహనీయులు ఏసుప్రభువు అని అన్నారు.

ప్రేమతో ఎంతటి వారినైనా జయించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి యేసు ప్రభువు అన్నారు. చాలామంది జీవితాలను ప్రేమతో మార్చి వెలుగు నింపారన్నారు.

మన బంధువులు స్నేహితులు ఎవరితోనైనా విభేదించి ఉంటే క్రిస్మస్ రోజున వారందరితో ప్రేమగా మెర్రీ క్రిస్మస్ అని పలకరించి కలగలుపుకోవాలని అప్పుడే నిజమైన క్రిస్మస్ కు విలువ ఉంటుందన్నారు. 
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ చాలా ముఖ్యమైన పండుగ అన్నారు. క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఏసు ప్రభువు ప్రతి ఒక్కరిలో ప్రేమ, కరుణ, జాలి ఉండాలని బోధించారన్నారు. 
వారి జీవితం ఆదర్శప్రాయం అంటూ తన వలె ఇతరులను కూడా ప్రేమించాలన్నది నేర్చుకోవాలన్నారు.

శత్రువులైన క్షమించగలిగే శక్తి ఉండాలన్నారు. 
జీవితంలో మంచి సూత్రాలను పాటిస్తే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఆ స్ఫూర్తిని, విలువలను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, పర్యవేశకులు నెల్సన్, బేగ్, అబ్దుల్ జబ్బార్ పలువురు కలెక్టరేట్ సిబ్బంది, వారి పిల్లలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...