మచిలీపట్నం:
మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన ఏలూరి వెంకట నరసయ్యకు 45 గ్రాముల బంగారు నగలను 15 రోజుల్లో తిరిగి ఇవ్వాలని భీమవరం ఇండియన్ బ్యాంక్ ని ఆదేశిస్తూ కృష్ణాజిల్లా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓ. వెంకట నాగేశ్వరరావు, సభ్యులు ఎస్. నరసింహారావు, వేముల కోటేశ్వరరావు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు చెప్పారు.
మచిలీపట్నం బలరాముని పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఏలూరు వెంకట నరసయ్య భీమవరం తన తల్లిని చూడడానికి వెళ్లి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో భీమవరం ఇండియన్ బ్యాంకులో 2018 నవంబర్ మూడో తేదీన 45 గ్రాములు బంగారం నగలను తాకట్టు పెట్టి 64,000 రూపాయలు లోను కోసం దరఖాస్తు పెట్టాడు. బ్యాంకు అధికారులు నగలు తీసుకుని సొమ్ము చెల్లించకుండా సదరు సొమ్మును 2017లో వెంకట నరసయ్య 'కాపు కార్పొరేషన్ రుణం' చెల్లించలేదని గోల్డ్ లోన్ డబ్బులను కాపు కార్పొరేషన్ లోన్ అకౌంట్ కు జమ చేశారు. బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన అధికారులు స్పందించలేదు.
వెంకట నరసయ్య తనకు జరిగిన అన్యాయాన్ని మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ లో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి ద్వారా ఫిర్యాదు చేశారు. కమిటీ ఇరు వర్గాలను విచారణ చేసి ఇరువర్గాల డాక్యుమెంట్ లను పరిశీలించి, బ్యాంకు అధికారులు చేసిన నిర్ణయం సరైనది కాదని తీర్పు చెబుతూ వినియోగదారుడు కి నగలను 15 రోజులు లోపు తిరిగి ఇవ్వాలని, 3000 రూపాయలు సేవా లోపం కింద, 5000 రూపాయలు నష్టపరిహారం కింద, రెండు వేల రూపాయలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పు చెప్పారు.
Comments
Post a Comment