Skip to main content

పెనమలూరు నియోజకవర్గ సమస్యలపై దృష్టి



మచిలీపట్నం:

పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం పెనమలూరు మండలం ఫోరంకిలోని ద్వారకా కన్వెన్షన్ లో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలసి పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా విజన్ యాక్షన్ యూనిట్ రూపొందించిందన్నారు. 
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించి కీలక పనితీరు సూచికలు( కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్) సాధించుటకు నియోజకవర్గ వారీగా శ్రద్ధ చూపుతున్నామన్నారు.
ఏ ఏ అభివృద్ధి పనులు ఏ ఏ స్థితిలో ఉన్నాయో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎలా పరిష్కరించాలో వాటన్నిటి పైన ఈ సందర్భంగా చర్చించడం జరిగిందన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
తదనంతరం పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలతోనూ కలసి సమీక్షించామని, దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి భూ సమస్యల పైన దృష్టి పెట్టామన్నారు. ఉయ్యూరు డివిజన్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి స్థలం ఇస్తామని దాత సజ్జ వెంకటేశ్వరరావు ముందుకు వచ్చారని, నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో కార్యాలయాలు ఎలా నిర్మించాలో నిర్మాణం ఎలా పూర్తి చేయాలో చర్చించామన్నారు. 
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సహకారంతో ఎక్కువగా పన్నులు వసూలు చేసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను మొదటి ప్రాధాన్యతగా కల్పించాలని అధికారులకు సూచించామన్నారు. ముస్లిం సోదరులకు ఈద్గా కాంపౌండ్ ఏర్పాటుకు చర్చించామన్నారు. మురుగునీటి వ్యవస్థ సమస్యగా ఉందని ఆక్రమణలను తొలగించుటకు అక్కడ ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించేందుకు ప్రధానంగా భూమి సమీకరణపై చర్చించామన్నారు.
అమృత 2.0 కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంటింటికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. 
మరికొన్ని సమస్యలను కూడా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.

ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, డ్వామా పిడి శివ, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జడ్పీ సీఈవో కే కన్నమ నాయుడు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈ లోకేష్, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, నియోజకవర్గంలోని తహసిల్దార్ లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...