Skip to main content

ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదు.

చిన్న చోరీ కాదు.... మహా పాపం.... పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ కన్నీరు..... తెర వెనుక వైకాపా ఆస్తి రాజీ డ్రామా.

మచిలీపట్నం :

     తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్, గొడుగు పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, వడ్లమూడి లక్ష్మీనరసింహారావు, చల్లారస్తా వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, జగన్నాధపురం  జగన్నాథ స్వామి దేవస్థానం కమిటీ సభ్యుడు తంగిరాల మిధున వ్యాస్, టిడిపి నాయకుడు, హేమాద్రి వెంకట లీలా ప్రసాద్ లు జగన్మోహన్ రెడ్డి పై మండిపడి ఆదివారం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం కార్యాలయంలో  పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. 

       ఈ సమావేశంలో తిరుమల పరకామణి లో కోట్లాది రూపాయల ఆస్తి దోచుకునేందుకు సిద్ధపడ్డారంటే జగన్మోహన్ రెడ్డి వారి పరివారం ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. దేవుడి ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని ఆగ్రహించి, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలపై దాడేనని వారు వ్యాఖ్యానించారు. పరకామణిలో దొంగతనాన్ని తప్పు కాదని సమర్థించడం  నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తుల్ని వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారని నిలదీశారు.

       పవిత్ర శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది అన్నారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులు కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏమిటి? అని ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజలలోను తీవ్ర ఆవేదన కనిపిస్తోంది అన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారని వారు స్పష్టం చేశారు.

     దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరని నిలదీశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న చోరీ కాదు, నేను మహా పాపం చేశాను అంటూ పరకామణి కేసు నిందితుడు రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చూస్తే జగన్మోహన్ రెడ్డి, వారి పరివారం తిరుమలను ఏ విధంగా దోచుకున్నారో అర్థం అవుతుంది అన్నారు. 

       రవికుమార్ పశ్చాతాపంపై భక్తులకు, ప్రజలకు తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేసు నడిచిన విధానం మరియు ఆస్తుల వ్యవహారం, నిందితుడిని వైకాపా నాయకులు బెదిరించి 160 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వారి బినామీల పేరున వ్రాయించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి అన్నారు. చోరీతో కోట్ల ఆస్తులు అర్జించిన వైకాపా నేతల హేయమైన మహా పాపం పై వైకాపా నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు అని ప్రశ్న శ్రీవారి విషయంలో చేసిన మహా పరాధానికి, తప్పు మీద తప్పులు, హత్య అన్ని బయటకు రావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. గొడుగు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆదాయం సమకూర్చితే, మాజీ మంత్రి పేర్ని నాని తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాడే, ఇప్పుడు పరకామణి కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు.

         గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసి, హిందువుల మనోభావాలను ఏ విధంగా వైసిపి పాలకులు దెబ్బతీశారో ప్రజలు గ్రహించాలి అన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...