మచిలీపట్నం డిసెంబర్ 4:
జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోతం సంచులను సమకూర్చుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ కు తెలిపారు.
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ, వైద్యం ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లాలో గోతం సంచుల కొరత ఉన్నట్లు తెలుస్తోందని దానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరించాలని కలెక్టర్ ను కోరారు.
నగరంలోని కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ జిల్లాలో వరి కోతలు ఎక్కువగా ఉండటంతో ఒక కోటి గోతం సంచులు అవసరం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
ఇప్పటికే 50 లక్షల గోతం సంచులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిల్లర్లతో సమావేశం నిర్వహించి తమిళనాడు నుండి మరో 20 లక్షల గోతం సంచులు తెప్పించామన్నారు.
సీఎంఆర్ డీలర్స్ నుంచి కూడా గోతం సంచులు తెప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇతర జిల్లాల నుంచి గోతం సంచులు సరఫరా అయ్యేలా సహకరించాలని ప్రధాన కార్యదర్శినీ కోరారు. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటనే స్పందిస్తూ ఇతర జిల్లాల నుండి గోతం సంచులు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డిఎస్ఓ మోహన్ బాబు, మార్క్ఫెడ్ డిఎం మురళీకృష్ణ, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జి జి హెచ్ పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు..
Comments
Post a Comment