Skip to main content

వైసీపీలో రంగ వర్ధంతి వివాదం


శాంతియుతంగా వంగవీటి మోహన రంగాకు ఘనంగా నివాళులు.

మచిలీపట్నం:
 
      మచిలీపట్నం ఎప్పుడూ గొడవలకు ఆమడ దూరంలో ఉంటుంది. అందులో రాజకీయ గొడవలు మడ అడవులతో నిండి ఉన్న బందరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కూడా అరుదు! 

అలాంటి నగరంలో గొడవలవుతాయని పోలీస్ భోగట్టా! ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష వైసీపీని వెనకకు తగ్గమని ఖాకీ పహారా! 

తగ్గిన వాడెప్పుడూ తక్కువ వాడు కాదు అని హుందాగా వ్యవహరించి  ర్యాలీ సమయాన్ని మార్చి... తగ్గిన వైసీపీ
   
  వివరాలల్లోకి వెళితే వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మచిలీపట్నం నగరంలో కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వేరువేరుగా ర్యాలీగా వెళ్లి రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించాలని అనుకున్నారు. 

     ఇరు పార్టీ లకు చెందిన నాయకులు,కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లే సమయం ఒకటి కావడంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతాయేమోనని అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

     కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్ళే సమయం ఒకటే కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ను సంప్రదించి మాట్లాడారు. 

      అనంతరం పోలీసులు, వైసిపి నాయకులకు కొన్ని సూచనలు చేశారు. ర్యాలీ సమయాన్ని మార్పు చేయవలసిందిగా వైయస్సార్సీపి పార్టీ నాయకులు పేర్ని నానిని, పోలీసులు కోరారు. దీనిపై వైసిపి నాయకులు నాని పోలీసులతో విభేదించారు. 

       ముందస్తు చర్యలో భాగంగా కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీ సమయాన్ని మార్చేది లేదని తేల్చి చెప్పడంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు వైఎస్ఆర్సిపి పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య నానితో చర్చించి, నచ్చ చెప్పడంతో సమయాన్ని మార్పు చేయడానికి అంగీకరించారు. దీనితో ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది. 

     కూటమి నాయకులు ర్యాలీ అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లి వంగవీటి మోహన రంగ కు ఘనంగా నివాళులర్పించారు. కూటమి, వైఎస్ఆర్సిపి పార్టీ ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వంగవీటి మోహనరంగా కు నివాళులర్పించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...