Skip to main content

ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం 

జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణకు అవసరమైన వాహనాలను, గోతం సంచులను సమకూర్చి అన్ని విధాల సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. 

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ తో కలసి జిల్లాలోని మిల్లుల యజమానులతో ధాన్యం సేకరణ పై సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి జిల్లాలో అత్యధికంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్లు వరి కోతలు కోయడంతో ఎక్కువగా ఒకేసారి ధాన్యం సేకరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
ఈ పరిస్థితులలో ప్రభుత్వం పెద్ద ఎత్తున గోనెసంచులను, వాహనాలను సమకూర్చినప్పటికీ సరిపోవడం లేదన్నారు. మిల్లర్లు వారి వద్ద ఉన్న గోనెసంచులను, వాహనాలను కూడా కావలసినంతగా సమకూర్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలన్నారు.

జిల్లాలో 75% వరి కోతలు పూర్తయ్యాయన్నారు.
ప్రస్తుతము 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. ఆ ధాన్యాన్ని తీసుకొనుటకు మిల్లర్లందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించుటకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలన్నారు.

అంతేకాకుండా బ్యాంకు గ్యారంటీలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని దానిని బాగా ఆరబెట్టుకునేందుకు వీలుగా మిల్లర్ల వద్ద ఉన్న డ్రైయర్లను వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా 1318 రకం వరి పండిస్తున్నారని ఆ ధాన్యాన్ని కూడా తప్పకుండా 
తీసుకోవాలన్నారు.

సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మరో 10 లక్షల గోనే సంచులు త్వరలో రానున్నాయన్నారు. 
ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరాం ప్రసాద్, జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షులు వీరయ్య, పలువురు మిల్లుల యజమానులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...