Skip to main content

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు – జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కానూరు: 

పరిశ్రమల ఏర్పాటు కోసం భూ కేటాయింపులు జరిగి అనుమతులు మంజూరు చేసిన యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు 100 అడుగుల రోడ్డులోని అన్నే వారి కళ్యాణ మండపంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులను ఒక వేదిక వద్దకు చేర్చి పారిశ్రామికవాడల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. పారిశ్రామికవేత్తలు చెప్పిన సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి, పరిష్కరించగలిగిన వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, పరిధిలో లేనివి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పారిశ్రామికవాడలలో మౌలిక వసతులు కల్పించి పలు ప్రభుత్వ రాయితీలను అందించి ప్రోత్సహిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 20 మంది వ్యాపారవేత్తలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని, వారిచ్చే నివేదిక ఆధారంగా తరచుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

మల్లవల్లి, వీరప్పనేనిగూడెంలో పారిశ్రామికవాడల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పలు పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచిస్తూ, వాటి నిర్వహణ బాధ్యతలను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సిబ్బందికి నివాస భవనాలు (క్వార్టర్స్) నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా, సమీపంలో ప్రభుత్వ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. సేల్ డీడ్ అగ్రిమెంట్ పత్రాలు ఉన్నప్పటికీ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులను సమీపిస్తే రుణాలు మంజూరు చేయడంలేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు.

సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, మల్లవల్లి పారిశ్రామికవాడ చైర్మన్ జి రవికుమార్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...